ఏడాది పాలనలో జగన్ అసమర్ధతతో అన్నివర్గాలూ నష్టపోయాయని మాజీమంత్రి కొల్లురవీంద్ర ఆరోపించారు. వైకాపా ప్రభుత్వ ఏడాదిపాలనలో చోటుచేసుకున్న అక్రమాలు, వైఫల్యాలను ఎత్తిచూపుతూ.... మచిలీపట్టణంలో ఆయన ఓ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రభుత్వ అవినీతి చర్యలతోపాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు చేస్తున్న అక్రమాలను సాక్ష్యాధారాలతో బయటపెడతామని కొల్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకునేందుకు తెదేపా నిరంతర పోరాటం చేస్తోందన్నారు.
ప్రభుత్వ అవినీతిని బయటపెడతాం: కొల్లు రవీంద్ర - తెదేపా నేత కొల్లు రవీంద్ర
వైకాపా ప్రభుత్వ ఏడాది పాలనలో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారని మాజీమంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు.

వైకాపా పాలన పై పుస్తకాన్ని విడుదల చేసిన కొల్లు రవీంద్ర
ఏడాది పాలనలో జగన్ అసమర్ధతతో అన్నివర్గాలూ నష్టపోయాయని మాజీమంత్రి కొల్లురవీంద్ర ఆరోపించారు. వైకాపా ప్రభుత్వ ఏడాదిపాలనలో చోటుచేసుకున్న అక్రమాలు, వైఫల్యాలను ఎత్తిచూపుతూ.... మచిలీపట్టణంలో ఆయన ఓ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రభుత్వ అవినీతి చర్యలతోపాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు చేస్తున్న అక్రమాలను సాక్ష్యాధారాలతో బయటపెడతామని కొల్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకునేందుకు తెదేపా నిరంతర పోరాటం చేస్తోందన్నారు.