ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 11AM

.

author img

By

Published : Dec 29, 2020, 11:00 AM IST

11 am top news
11 am ప్రధాన వార్తలు
  • ఆసీస్​పై భారత్ విజయం.. సిరీస్​ 1-1తో సమం

ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో ఘనవిజయం సాధించింది టీమ్ఇండియా. 70 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫలితంగా నాలుగు టెస్టుల సిరీస్​ను 1-1 తేడాతో సమం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'తాడిపత్రి ఘటన.. రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకు సాక్ష్యం'

అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనేందుకు ఈ ఘటన ఓ సాక్ష్యమన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • దివ్యాంగుల ఎముకలు, కీళ్ల రోగాలకు 'బర్డ్'‌ ఉచిత సేవలు

తిరుమల తిరుపతి దేవస్థానం సారథ్యంలోని బర్డ్‌ ఆసుపత్రి..సేవలు మరింత విస్తరించనున్నాయి. 15 ఆపరేషన్‌ థియేటర్లతో, అత్యాధునిక పరికరాలతో, దేశవిదేశీ నిపుణుల పర్యవేక్షణలో.. నిరుపేదలకు మరిన్ని సేవలు అందనున్నాయి. తుంటి, మోకీలు, వెన్నెముక శస్త్రచికిత్సలకు కొంత మేర ఛార్జీలు వసూలు చేయనుండగా.. మిగిలిన సేవలను ఉచితంగా అందించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ప్రజలు ఎన్నుకోని ‘ఎమ్మెల్యే’.. కారుకు స్టిక్కర్ తొలగించని వైకాపా నేత

మళ్లా విజయప్రసాద్‌.. విశాఖలో వైకాపా నేత. ప్రస్తుతం విశాఖ పశ్చిమ నియోజకవర్గానికి పార్టీ సమన్వయకర్త. 2014, 2019 ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలయ్యారు. కానీ ఆయన తన కారుకు ‘ఎమ్మెల్యే’ స్టిక్కర్‌ వేసుకునే ప్రజల్లో తిరుగుతున్నారు. అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ వస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అహో.. అరటిగెలల పందిరి!

శ్రీ పడమటమ్మ నెలపండగలో భాగంగా వేసిన అరటి గెలల పందిరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కశింకోటకి చెందిన గొంతిన కుటుంబీకుల ఇలవేల్పు పడమటమ్మ. ఈ అమ్మవారికి జాతరను రెండేళ్లకోసారి నిర్వహిస్తారు. ఇందులో భాగంగా అరటి గెలలతో పందిరిని ఏర్పాటు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఉపసభాపతి మరణానికి ఇదే కారణమా?

ఇటీవల కర్ణాటక మండలి సమావేశాల్లో జరిగిన గందరగోళమే ఉపసభాపతి ధర్మె గౌడ మరణానికి కారణమై ఉంటుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆత్మహత్యకు పాల్పడే ముందు ఆయన వదిలి వెళ్లిన సూసైడ్ నోట్​ గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కరోనా వ్యాప్తి తగ్గుముఖం- కొత్తగా 16,432 కేసులు

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 16,432 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 252 కొవిడ్​ మరణాలు సంభవించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

అమెరికా అర్కన్​సాస్​ రాష్ట్రం అట్కిన్స్ నగరంలో శుక్రవారం సాయంత్రం దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. వీరిలో ఒకరు మిగతా వారిని హత్యచేసి ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆధికారులు భావిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • లక్షణాలు లేకపోయినా బాధితులకు దీర్ఘకాల రక్షణ!

కొవిడ్​ లక్షణాలు ఉన్నా, లేకపోయినా బాధితులకు దీర్ఘకాల రక్షణ ఉంటుందని క్వీని మోరీ యూనివర్సిటీ, ఇంపీరియల్ కాలేజ్​ సంయుక్తంగా చేసిన పరిశోధనలో తేలింది. రోగ నిరోధక వ్యవస్థలో టి-కణాల స్పందనను అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు ఈ ఫలితాన్ని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • టాలీవుడ్​లో రీమేక్​ల హవా.. వాళ్లు మళ్లీ చూస్తారా?

వచ్చే ఏడాది, టాలీవుడ్​ ప్రేక్షకుల్ని పలు రీమేక్​లు పలకరించనున్నాయి. ఓటీటీల వల్ల వాటి ఒరిజినల్​ సినిమాల్ని మనవాళ్లు ఇప్పటికే చూసేస్తున్నారు. దీంతో రాబోయే రీమేక్​ల్ని మళ్లీ చూస్తారో? లేదో? తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.

  • ఆసీస్​పై భారత్ విజయం.. సిరీస్​ 1-1తో సమం

ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో ఘనవిజయం సాధించింది టీమ్ఇండియా. 70 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫలితంగా నాలుగు టెస్టుల సిరీస్​ను 1-1 తేడాతో సమం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'తాడిపత్రి ఘటన.. రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకు సాక్ష్యం'

అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయనేందుకు ఈ ఘటన ఓ సాక్ష్యమన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • దివ్యాంగుల ఎముకలు, కీళ్ల రోగాలకు 'బర్డ్'‌ ఉచిత సేవలు

తిరుమల తిరుపతి దేవస్థానం సారథ్యంలోని బర్డ్‌ ఆసుపత్రి..సేవలు మరింత విస్తరించనున్నాయి. 15 ఆపరేషన్‌ థియేటర్లతో, అత్యాధునిక పరికరాలతో, దేశవిదేశీ నిపుణుల పర్యవేక్షణలో.. నిరుపేదలకు మరిన్ని సేవలు అందనున్నాయి. తుంటి, మోకీలు, వెన్నెముక శస్త్రచికిత్సలకు కొంత మేర ఛార్జీలు వసూలు చేయనుండగా.. మిగిలిన సేవలను ఉచితంగా అందించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ప్రజలు ఎన్నుకోని ‘ఎమ్మెల్యే’.. కారుకు స్టిక్కర్ తొలగించని వైకాపా నేత

మళ్లా విజయప్రసాద్‌.. విశాఖలో వైకాపా నేత. ప్రస్తుతం విశాఖ పశ్చిమ నియోజకవర్గానికి పార్టీ సమన్వయకర్త. 2014, 2019 ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలయ్యారు. కానీ ఆయన తన కారుకు ‘ఎమ్మెల్యే’ స్టిక్కర్‌ వేసుకునే ప్రజల్లో తిరుగుతున్నారు. అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ వస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అహో.. అరటిగెలల పందిరి!

శ్రీ పడమటమ్మ నెలపండగలో భాగంగా వేసిన అరటి గెలల పందిరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కశింకోటకి చెందిన గొంతిన కుటుంబీకుల ఇలవేల్పు పడమటమ్మ. ఈ అమ్మవారికి జాతరను రెండేళ్లకోసారి నిర్వహిస్తారు. ఇందులో భాగంగా అరటి గెలలతో పందిరిని ఏర్పాటు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఉపసభాపతి మరణానికి ఇదే కారణమా?

ఇటీవల కర్ణాటక మండలి సమావేశాల్లో జరిగిన గందరగోళమే ఉపసభాపతి ధర్మె గౌడ మరణానికి కారణమై ఉంటుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆత్మహత్యకు పాల్పడే ముందు ఆయన వదిలి వెళ్లిన సూసైడ్ నోట్​ గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కరోనా వ్యాప్తి తగ్గుముఖం- కొత్తగా 16,432 కేసులు

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 16,432 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 252 కొవిడ్​ మరణాలు సంభవించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

అమెరికా అర్కన్​సాస్​ రాష్ట్రం అట్కిన్స్ నగరంలో శుక్రవారం సాయంత్రం దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. వీరిలో ఒకరు మిగతా వారిని హత్యచేసి ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆధికారులు భావిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • లక్షణాలు లేకపోయినా బాధితులకు దీర్ఘకాల రక్షణ!

కొవిడ్​ లక్షణాలు ఉన్నా, లేకపోయినా బాధితులకు దీర్ఘకాల రక్షణ ఉంటుందని క్వీని మోరీ యూనివర్సిటీ, ఇంపీరియల్ కాలేజ్​ సంయుక్తంగా చేసిన పరిశోధనలో తేలింది. రోగ నిరోధక వ్యవస్థలో టి-కణాల స్పందనను అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు ఈ ఫలితాన్ని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • టాలీవుడ్​లో రీమేక్​ల హవా.. వాళ్లు మళ్లీ చూస్తారా?

వచ్చే ఏడాది, టాలీవుడ్​ ప్రేక్షకుల్ని పలు రీమేక్​లు పలకరించనున్నాయి. ఓటీటీల వల్ల వాటి ఒరిజినల్​ సినిమాల్ని మనవాళ్లు ఇప్పటికే చూసేస్తున్నారు. దీంతో రాబోయే రీమేక్​ల్ని మళ్లీ చూస్తారో? లేదో? తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.