ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1PM

టాప్ టెన్ న్యూస్

author img

By

Published : May 1, 2021, 1:01 PM IST

top news
టాప్ టెన్ న్యూస్
  • రాష్ట్రాలకు రూ. 8,873 కోట్ల ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులు

కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధుల(ఎస్​డీఆర్​ఎఫ్​)ను శనివారం విడుదల చేసింది. ఆయా రాష్ట్రాలకు చేరే మొత్తంలో 50 శాతం సొమ్మును కొవిడ్​ కట్టడి చర్యలకు వాడుకోవచ్చని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • తెదేపా ఆధ్వర్యంలో వర్చువల్​గా మేడే వేడుకలు

తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేడే వేడుకలను వర్చువల్​గా నిర్వహిస్తున్నారు. లైవ్ కోసం క్లిక్ చేయండి.

  • అరెస్టు చేసే అవకాశం ఉంది: దేవినేని

సీఎం ఆనందం కోసం తనని అరెస్టు చేసే అవకాశం ఉందని ఆరోపించారు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. సీఐడీ విచారణకు హాజరయ్యే ముందు మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో జే ట్యాక్స్ పేరుతో ధాన్యం దోపిడీ జరుగుతోందన్నారు. రైతుల తరపున రాజమహేంద్రవరం జైలులో ఉండేందుకు సిద్ధమని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • దేశీ ధాన్యంతో తిరుమలేశుడికి నైవేద్యం సమర్పణ

తిరుమలలో కొలువైన వెంకటేశ్వర స్వామికి దేశీ రకం ధాన్యంతో నైవేద్యం సమర్పించినట్లు తితిదే ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కొవిడ్​ వార్డులో నీళ్లు లేక రోగి మృతి.. వీడియో వైరల్!

తాగేందుకు నీరు లేని కారణంతో ఓ కొవిడ్ రోగి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తరాఖండ్‌లో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. సదరు రోగి తాగునీరు పంపించాలంటూ పదేపదే విజ్ఞప్తి చేయడం వీడియోలో కనిపిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • యుద్ధవిమానాలు నడిపి.. ఇప్పుడు జంతువులతో సావాసం!

విశ్రాంత వైమానిక దళ అధికారి. అనుకోని కారణాలతో ఒంటరిగా బతకాల్సిరావడం వల్ల.. జంతువులనే కుటుంబ సభ్యులుగా మార్చుకున్నారాయన. రోజంతా వాటితోనే గడుపుతూ.. కంటికి రెప్పలా సాకుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • భారత్‌కు అప్పగింతపై మళ్లీ కోర్టుకు నీరవ్ మోదీ

రుణఎగవేతదారు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ తనను భారత్​కు అప్పగించకుండా ఉండేందుకు బ్రిటన్ హైకోర్టును ఆశ్రయించారు. కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ తాజాగా పిటిషన్‌ దాఖలు చేశారు. ఇటీవలే నీరవ్​ను భారత్​కు అప్పగించేందుకు బ్రిటన్ హోంమంత్రిత్వ శాఖ అనుమతి తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అమెరికా నుంచి భారత్​కు పీ-8ఐ నిఘా విమానాలు!

దేశ పహారాలో నిఘా కోసం ఉపయోగించే ఆరు పీ-8ఐ విమానాలను భారత్​కు విక్రయించేందుకు అమెరికా అంగీకరించింది. ఈ మేరకు డిఫెన్స్ సెక్యూరిటీ కో-ఆపరేషన్ ఏజెన్సీ అమెరికన్ కాంగ్రెస్‌కు ధ్రువీకరణ పత్రాన్ని అందించింది. వీటి కొనుగోలుకు సుమారు 2.42 బిలియన్ డాలర్ల వ్యయం అవుతుందని అంచనా. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఐపీఎల్​ టైటిలే లక్ష్యంగా చెన్నై 'కింగ్స్'​ గర్జన

విజిల్‌ పోడు.. ఇది చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఉత్సాహపరిచే మాట. ఆటగాళ్లకు కొత్త శక్తినిచ్చే నినాదం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ జట్టుకు అతికినట్లు సరిపోయే తారక మంత్రం. ఎందుకంటే చెన్నై గతేడాది పేలవ ప్రదర్శనతో కనీసం ప్లేఆఫ్స్‌ చేరకుండా తొలిసారి ఇంటిముఖం పట్టింది. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆటగాళ్లు రాణిస్తున్నారు, పరుగులు తీస్తున్నారు, వికెట్లు పడగొడుతున్నారు. ప్రత్యర్థులపై గర్జిస్తూ వరుస విజయాలు సాధిస్తున్నారు. మొత్తంగా చెప్పాలంటే గతేడాదితో పోలిస్తే చెన్నై ఇప్పుడు అద్భుతంగా రాణిస్తోంది. ఒక ఏడాదిలో చెన్నైలో ఏం మార్పొచ్చింది... తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.

  • నిర్మాతగా కంగనా రనౌత్.. ఓటీటీలో 'ఏ1 ఎక్స్​ప్రెస్'

నటిగా గుర్తింపు తెచ్చుకున్న కంగనా రనౌత్.. నిర్మాతగా మారింది. సందీప్ కిషన్​ హాకీ ప్లేయర్​గా నటించిన 'ఏ1 ఎక్స్​ప్రెస్' ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రాష్ట్రాలకు రూ. 8,873 కోట్ల ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులు

కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధుల(ఎస్​డీఆర్​ఎఫ్​)ను శనివారం విడుదల చేసింది. ఆయా రాష్ట్రాలకు చేరే మొత్తంలో 50 శాతం సొమ్మును కొవిడ్​ కట్టడి చర్యలకు వాడుకోవచ్చని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • తెదేపా ఆధ్వర్యంలో వర్చువల్​గా మేడే వేడుకలు

తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేడే వేడుకలను వర్చువల్​గా నిర్వహిస్తున్నారు. లైవ్ కోసం క్లిక్ చేయండి.

  • అరెస్టు చేసే అవకాశం ఉంది: దేవినేని

సీఎం ఆనందం కోసం తనని అరెస్టు చేసే అవకాశం ఉందని ఆరోపించారు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. సీఐడీ విచారణకు హాజరయ్యే ముందు మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో జే ట్యాక్స్ పేరుతో ధాన్యం దోపిడీ జరుగుతోందన్నారు. రైతుల తరపున రాజమహేంద్రవరం జైలులో ఉండేందుకు సిద్ధమని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • దేశీ ధాన్యంతో తిరుమలేశుడికి నైవేద్యం సమర్పణ

తిరుమలలో కొలువైన వెంకటేశ్వర స్వామికి దేశీ రకం ధాన్యంతో నైవేద్యం సమర్పించినట్లు తితిదే ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కొవిడ్​ వార్డులో నీళ్లు లేక రోగి మృతి.. వీడియో వైరల్!

తాగేందుకు నీరు లేని కారణంతో ఓ కొవిడ్ రోగి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తరాఖండ్‌లో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. సదరు రోగి తాగునీరు పంపించాలంటూ పదేపదే విజ్ఞప్తి చేయడం వీడియోలో కనిపిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • యుద్ధవిమానాలు నడిపి.. ఇప్పుడు జంతువులతో సావాసం!

విశ్రాంత వైమానిక దళ అధికారి. అనుకోని కారణాలతో ఒంటరిగా బతకాల్సిరావడం వల్ల.. జంతువులనే కుటుంబ సభ్యులుగా మార్చుకున్నారాయన. రోజంతా వాటితోనే గడుపుతూ.. కంటికి రెప్పలా సాకుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • భారత్‌కు అప్పగింతపై మళ్లీ కోర్టుకు నీరవ్ మోదీ

రుణఎగవేతదారు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ తనను భారత్​కు అప్పగించకుండా ఉండేందుకు బ్రిటన్ హైకోర్టును ఆశ్రయించారు. కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ తాజాగా పిటిషన్‌ దాఖలు చేశారు. ఇటీవలే నీరవ్​ను భారత్​కు అప్పగించేందుకు బ్రిటన్ హోంమంత్రిత్వ శాఖ అనుమతి తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అమెరికా నుంచి భారత్​కు పీ-8ఐ నిఘా విమానాలు!

దేశ పహారాలో నిఘా కోసం ఉపయోగించే ఆరు పీ-8ఐ విమానాలను భారత్​కు విక్రయించేందుకు అమెరికా అంగీకరించింది. ఈ మేరకు డిఫెన్స్ సెక్యూరిటీ కో-ఆపరేషన్ ఏజెన్సీ అమెరికన్ కాంగ్రెస్‌కు ధ్రువీకరణ పత్రాన్ని అందించింది. వీటి కొనుగోలుకు సుమారు 2.42 బిలియన్ డాలర్ల వ్యయం అవుతుందని అంచనా. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఐపీఎల్​ టైటిలే లక్ష్యంగా చెన్నై 'కింగ్స్'​ గర్జన

విజిల్‌ పోడు.. ఇది చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఉత్సాహపరిచే మాట. ఆటగాళ్లకు కొత్త శక్తినిచ్చే నినాదం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ జట్టుకు అతికినట్లు సరిపోయే తారక మంత్రం. ఎందుకంటే చెన్నై గతేడాది పేలవ ప్రదర్శనతో కనీసం ప్లేఆఫ్స్‌ చేరకుండా తొలిసారి ఇంటిముఖం పట్టింది. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆటగాళ్లు రాణిస్తున్నారు, పరుగులు తీస్తున్నారు, వికెట్లు పడగొడుతున్నారు. ప్రత్యర్థులపై గర్జిస్తూ వరుస విజయాలు సాధిస్తున్నారు. మొత్తంగా చెప్పాలంటే గతేడాదితో పోలిస్తే చెన్నై ఇప్పుడు అద్భుతంగా రాణిస్తోంది. ఒక ఏడాదిలో చెన్నైలో ఏం మార్పొచ్చింది... తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.

  • నిర్మాతగా కంగనా రనౌత్.. ఓటీటీలో 'ఏ1 ఎక్స్​ప్రెస్'

నటిగా గుర్తింపు తెచ్చుకున్న కంగనా రనౌత్.. నిర్మాతగా మారింది. సందీప్ కిషన్​ హాకీ ప్లేయర్​గా నటించిన 'ఏ1 ఎక్స్​ప్రెస్' ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.