ETV Bharat / city

చిన్నారికి వైద్యం చేసిన ఆస్పత్రి సీజ్​... ఎందుకంటే? - మహబూబాబాద్​ జిల్లా తాజా వార్తలు

తెలంగాణలోని మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీకర చిన్న పిల్లల ఆసుపత్రిని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సీజ్ చేశారు. ఇటీవల కరోనాతో మృతి చెందిన చిన్నారికి వైద్యం చేసిన కారణంగా వైద్యులను, సిబ్బందిని క్వారంటైన్​కు తరలించి... ఆస్పత్రిని సీజ్​ చేశారు.

childrens-hospital
childrens-hospital
author img

By

Published : Apr 21, 2020, 3:48 PM IST

తెలంగాణలో కరోనాతో మృతి చెందిన నారాయణపేట జిల్లాకు చెందిన చిన్నారికి వైద్యం చేసిన ఆస్పత్రిని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సీజ్​ చేశారు. చిన్నారిని ఈనెల 15న మహబూబ్​నగర్​లోని శ్రీకర చిన్నపిల్లల ఆస్పత్రిలో చేర్పించారు. పాపను పరీక్షించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు.

ఈనెల 18న చిన్నారికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ కావడం వల్ల ఆసుపత్రి వైద్యులు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఆసుపత్రిని మూసివేసి వైద్యులను, సిబ్బందిని క్వారంటైన్​కు తరలించారు. ఘటనపై విచారణ జరిపిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆస్పత్రిని సీజ్ చేశారు.

తెలంగాణలో కరోనాతో మృతి చెందిన నారాయణపేట జిల్లాకు చెందిన చిన్నారికి వైద్యం చేసిన ఆస్పత్రిని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సీజ్​ చేశారు. చిన్నారిని ఈనెల 15న మహబూబ్​నగర్​లోని శ్రీకర చిన్నపిల్లల ఆస్పత్రిలో చేర్పించారు. పాపను పరీక్షించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు.

ఈనెల 18న చిన్నారికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ కావడం వల్ల ఆసుపత్రి వైద్యులు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఆసుపత్రిని మూసివేసి వైద్యులను, సిబ్బందిని క్వారంటైన్​కు తరలించారు. ఘటనపై విచారణ జరిపిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆస్పత్రిని సీజ్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.