ETV Bharat / city

దేవినేని ఉమపై చర్యలు చేపట్టవద్దన్న ఆదేశాలు పొడిగింపు: హైకోర్టు

author img

By

Published : May 7, 2021, 11:50 AM IST

తెదేపా నేత దేవినేని ఉమ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్​పై విచారణ జరిగింది. సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని ఉమ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఉమపై మే 7 వరకు తొందరపాటు చర్యలు చేపట్టవద్దని గతంలో ఆదేశాలు ఉండగా దీనిని జూన్ 17 వరకు పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది.

devineni uma
devineni uma

తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. తనపై సీఐడీ నమోదు చేసిన కేసు కొట్టివేయాలంటూ దేవినేని ఉప కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దేవినేని ఉమపై మే 7 వరకు తొందరపాటు చర్యలు చేపట్టవద్దని గతంలో ఆదేశాలు ఉన్నాయి. విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ ఆదేశాలను జూన్‌ 17 వరకు పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. గుంటూరు సీఐడీ డీఎస్పీ విచారణాధికారిగా ఉండాలంటే కొనసాగవచ్చుని హైకోర్టు తెలిపింది. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఉమ అభియోగాలు ఎదుర్కొంటున్నారు.

తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. తనపై సీఐడీ నమోదు చేసిన కేసు కొట్టివేయాలంటూ దేవినేని ఉప కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దేవినేని ఉమపై మే 7 వరకు తొందరపాటు చర్యలు చేపట్టవద్దని గతంలో ఆదేశాలు ఉన్నాయి. విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ ఆదేశాలను జూన్‌ 17 వరకు పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. గుంటూరు సీఐడీ డీఎస్పీ విచారణాధికారిగా ఉండాలంటే కొనసాగవచ్చుని హైకోర్టు తెలిపింది. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఉమ అభియోగాలు ఎదుర్కొంటున్నారు.

ఇదీ చదవండి: వరుసగా రెండో రోజూ 4 లక్షలకుపైగా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.