రాష్ట్రంలో కరోనా చికిత్స అందించే ఆసుపత్రులు క్రమేపి పెరుగుతున్నాయి. వీటిలో ప్రైవేట్ ఆసుపత్రులు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నాయి. ఏప్రిల్ 21న 185 ప్రైవేట్, ప్రభుత్వాసుపత్రుల్లో కలిపి ఐసీయూ 2,630, ఆక్సిజన్ 11,237, సాధారణ పడకలు 5,889 ఉండగా.. మే 1న 561 ప్రైవేట్, ప్రభుత్వాసుపత్రుల్లో కలిపి 6,191 ఐసీయూ, 20,542 ఆక్సిజన్, 13,412 సాధారణ పడకలు అందుబాటులోకి వచ్చాయి. కేసులు పెరుగుతుండడంతో కొవిడ్ చికిత్సను అందించేందుకు దరఖాస్తులు చేసుకుంటున్న ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధిత జిల్లా యంత్రాంగం వెనువెంటనే అనుమతులు ఇచ్చేస్తోంది. నిన్న గంటల వ్యవధిలోనే తొమ్మిది ఆసుపత్రులకు అనుమతి లభించింది. వీటిల్లో జిల్లాకు పదిలోపే ప్రభుత్వాసుపత్రులు ఉంటున్నాయి. మిగిలినవన్నీ ప్రైవేటువే. సుమారు 480 వరకు ప్రైవేట్ ఆసుపత్రులు ఉంటాయని అంచనా. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎక్కువగానే ఉన్నాయి. ఐసీయూ, ఆక్సిజన్, సాధారణ విభాగాల్లో కలిపి గరిష్ఠంగా 50వరకు పడకల భర్తీకి మాత్రమే జిల్లాల అధికారులు అనుమతులు ఇస్తున్నారు. గుంటూరు జిల్లాలో గరిష్ఠంగా 71 ఆసుపత్రుల్లో, కృష్ణాలో 65, ప్రకాశం 32, చిత్తూరు 42, కడప 20, విశాఖ జిల్లాలో 51 ఆసుపత్రుల్లో కొవిడ్ చికిత్స అందుబాటులోకి వచ్చింది.
ఇదీ చదవండి: ఆసుపత్రుల్లో డిశ్ఛార్జి డ్రైవ్.. పడకలు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు
పదుల సంఖ్యలోనే పడకలు ఖాళీ: