ETV Bharat / city

తెలంగాణ: నెలరోజుల్లోనే 8 రెట్లు... 8 రోజుల్లోనే డబుల్!

author img

By

Published : Jul 5, 2020, 11:05 AM IST

తెలంగాణలో కరోనా కోరలు చాస్తోంది. మొత్తం పాజిటివ్‌ కేసులు 22 వేలు దాటాయి. శనివారం ఒక్కరోజే కొత్తగా 1,850 కేసులు నమోదయ్యాయి. గత 15 రోజుల నుంచి పాజిటివ్ కేసులు మరీ ఎక్కువయ్యాయి. నెల రోజుల్లోనే 8 రెట్లు పెరిగాయి. కేసులు పెరుగుతుండడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

corona-virus-cases-double-in-8-days-in-telangana
తెలంగాణలోకరోనా కేసులు

తెలంగాణలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. జూన్‌ ఒకటో తేదీతో పోల్చితే శనివారం నాటికి రోజుకు 20 రెట్లకు పైగా కేసులు వస్తున్నాయి. గత 15 రోజుల నుంచి ఈ కేసులు మరీ ఎక్కువయ్యాయి. జీహెచ్‌ఎంసీలో కొవిడ్‌ వ్యాప్తి ఉద్ధృతమవుతోంది. రాష్ట్రంలో నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల్లో దాదాపు 80 శాతానికి పైగా రాజధానిలో ఉండటంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

150 కంటెయిన్‌మెంట్ జోన్లు

ప్రస్తుతం 150 ప్రాంతాలను కొత్తగా కంటెయిన్‌మెంట్‌ జోన్లుగా ప్రభుత్వం గుర్తించి కట్టడి చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఇప్పటికే 600 పోస్టులు మంజూరు చేసింది. గాంధీలో పడకలు నిండిపోయినందున కరోనా చికిత్స కోసం టిమ్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక్కడా మరో 600 పోస్టులు కేటాయించింది. ఈ పోస్టులన్నీ యుద్ధప్రాతిపదికన భర్తీ చేయనుంది. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లోనూ పడకలు నిండిపోవటంతో ప్రైవేటు బోధనాసుపత్రుల్లోనూ సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువస్తోంది.

8 రోజుల్లోనే డబుల్

జూన్‌లో ప్రతి వారం నమోదైన కేసుల్లో 50 శాతం నుంచి ఒక్కో వారం 100 శాతం వరకు పెరుగుదల కనిపిస్తోంది. అన్‌లాక్‌ నిబంధనలు అమలులోకి రావడం, మరోవైపు పరీక్షల సంఖ్యను పెంచటంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతున్న కేసులు తక్కువ వ్యవధిలో రెట్టింపవుతున్నాయి. జూన్‌ గణాంకాలను పరిశీలిస్తే ఒకటో తేదీ నాటికి పాజిటివ్‌ కేసుల సంఖ్య రెట్టింపయ్యేందుకు 17 రోజుల సమయం పట్టింది. తర్వాత కేవలం 8 రోజుల్లోనే రెట్టింపయ్యాయి. ఇటీవల కరోనా పాజిటివ్‌ కేసుల్లో యువత, నడివయస్కులు ఎక్కువ ఉంటున్నారు. మాస్కులు ధరించాలని, అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు.

పాజిటివ్‌ రేటు ఎక్కువే

కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ కేసుల రేటు ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతానికి 20 శాతానికి చేరువలో ఉంది. రాష్ట్రంలో శనివారం నాటికి 1,10,545 పరీక్షలు నిర్వహించగా.. 22,312 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. తమిళనాడు, దిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల్లో పాజిటివ్‌ రేటు అధికంగా నమోదవుతోంది. తెలంగాణలోనూ కేసులు పెరుగుతుండడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 765 కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. జూన్‌ ఒకటో తేదీతో పోల్చితే శనివారం నాటికి రోజుకు 20 రెట్లకు పైగా కేసులు వస్తున్నాయి. గత 15 రోజుల నుంచి ఈ కేసులు మరీ ఎక్కువయ్యాయి. జీహెచ్‌ఎంసీలో కొవిడ్‌ వ్యాప్తి ఉద్ధృతమవుతోంది. రాష్ట్రంలో నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల్లో దాదాపు 80 శాతానికి పైగా రాజధానిలో ఉండటంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

150 కంటెయిన్‌మెంట్ జోన్లు

ప్రస్తుతం 150 ప్రాంతాలను కొత్తగా కంటెయిన్‌మెంట్‌ జోన్లుగా ప్రభుత్వం గుర్తించి కట్టడి చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఇప్పటికే 600 పోస్టులు మంజూరు చేసింది. గాంధీలో పడకలు నిండిపోయినందున కరోనా చికిత్స కోసం టిమ్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక్కడా మరో 600 పోస్టులు కేటాయించింది. ఈ పోస్టులన్నీ యుద్ధప్రాతిపదికన భర్తీ చేయనుంది. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లోనూ పడకలు నిండిపోవటంతో ప్రైవేటు బోధనాసుపత్రుల్లోనూ సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువస్తోంది.

8 రోజుల్లోనే డబుల్

జూన్‌లో ప్రతి వారం నమోదైన కేసుల్లో 50 శాతం నుంచి ఒక్కో వారం 100 శాతం వరకు పెరుగుదల కనిపిస్తోంది. అన్‌లాక్‌ నిబంధనలు అమలులోకి రావడం, మరోవైపు పరీక్షల సంఖ్యను పెంచటంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతున్న కేసులు తక్కువ వ్యవధిలో రెట్టింపవుతున్నాయి. జూన్‌ గణాంకాలను పరిశీలిస్తే ఒకటో తేదీ నాటికి పాజిటివ్‌ కేసుల సంఖ్య రెట్టింపయ్యేందుకు 17 రోజుల సమయం పట్టింది. తర్వాత కేవలం 8 రోజుల్లోనే రెట్టింపయ్యాయి. ఇటీవల కరోనా పాజిటివ్‌ కేసుల్లో యువత, నడివయస్కులు ఎక్కువ ఉంటున్నారు. మాస్కులు ధరించాలని, అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు.

పాజిటివ్‌ రేటు ఎక్కువే

కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ కేసుల రేటు ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతానికి 20 శాతానికి చేరువలో ఉంది. రాష్ట్రంలో శనివారం నాటికి 1,10,545 పరీక్షలు నిర్వహించగా.. 22,312 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. తమిళనాడు, దిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల్లో పాజిటివ్‌ రేటు అధికంగా నమోదవుతోంది. తెలంగాణలోనూ కేసులు పెరుగుతుండడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 765 కరోనా పాజిటివ్‌ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.