ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 14,792 కరోనా కేసులు, 57 మరణాలు

author img

By

Published : Apr 29, 2021, 6:20 PM IST

Updated : Apr 29, 2021, 6:45 PM IST

ఏపీలో సెకండ్ వేవ్
ఏపీలో సెకండ్ వేవ్

18:13 April 29

రాష్ట్రంలో కొత్తగా 14,792 కరోనా కేసులు, 57 మరణాలు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 8,188 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 1,14,158 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 86,035 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు వైద్యారోగ్య శాఖ తెలిపింది.  

కరోనా మృతులు...

కరోనాతో అనంతపురం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఏడుగురు చొప్పున మృతిచెందారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆరుగురు, చిత్తూరు, విశాఖ జిల్లాల్లో ఐదుగురు చొప్పున మరణించారు. నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు, కడప, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురు, కర్నూలు జిల్లాలో ఇద్దరు, గుంటూరు జిల్లాలో ఒకరు మృతిచెందారు.

జిల్లాల్లో కరోనా....

చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 1,831 కరోనా కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో 1,829, గుంటూరు జిల్లాలో 1,760, తూర్పుగోదావరి జిల్లాలో 1,702, అనంతపురం జిల్లాలో 1,538, విశాఖ జిల్లాలో 1,129, నెల్లూరు జిల్లాలో 1,002, కర్నూలు జిల్లాలో 876, కడప జిల్లాలో 669, ప్రకాశం జిల్లాలో 639, విజయనగరం జిల్లాలో 624, కృష్ణా జిల్లాలో 597, పశ్చిమగోదావరి జిల్లాలో 596 కరోనా కేసులు నమోదైనట్టు ప్రభుత్వం తెలిపింది.

ఇదీ చదవండి:  కొవాగ్జిన్ టీకా ధర తగ్గించిన భారత్‌ బయోటెక్‌

18:13 April 29

రాష్ట్రంలో కొత్తగా 14,792 కరోనా కేసులు, 57 మరణాలు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 8,188 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 1,14,158 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 86,035 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు వైద్యారోగ్య శాఖ తెలిపింది.  

కరోనా మృతులు...

కరోనాతో అనంతపురం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఏడుగురు చొప్పున మృతిచెందారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆరుగురు, చిత్తూరు, విశాఖ జిల్లాల్లో ఐదుగురు చొప్పున మరణించారు. నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు, కడప, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురు, కర్నూలు జిల్లాలో ఇద్దరు, గుంటూరు జిల్లాలో ఒకరు మృతిచెందారు.

జిల్లాల్లో కరోనా....

చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 1,831 కరోనా కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో 1,829, గుంటూరు జిల్లాలో 1,760, తూర్పుగోదావరి జిల్లాలో 1,702, అనంతపురం జిల్లాలో 1,538, విశాఖ జిల్లాలో 1,129, నెల్లూరు జిల్లాలో 1,002, కర్నూలు జిల్లాలో 876, కడప జిల్లాలో 669, ప్రకాశం జిల్లాలో 639, విజయనగరం జిల్లాలో 624, కృష్ణా జిల్లాలో 597, పశ్చిమగోదావరి జిల్లాలో 596 కరోనా కేసులు నమోదైనట్టు ప్రభుత్వం తెలిపింది.

ఇదీ చదవండి:  కొవాగ్జిన్ టీకా ధర తగ్గించిన భారత్‌ బయోటెక్‌

Last Updated : Apr 29, 2021, 6:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.