ETV Bharat / city

రికార్డు సంఖ్యలో కరోనా పరీక్షలు.. అదే స్థాయిలో కేసులు నమోదు

author img

By

Published : Jun 25, 2020, 7:01 AM IST

రాష్ట్రంలో కరోనా ఘంటికలు మోగుతున్నాయి. 24 రోజుల్లో 6,650 మందికి వైరస్‌ సోకింది. రాష్ట్రంలో కేసుల సంఖ్య 10 వేలు దాటింది. ఒకే రోజు 10 మంది చనిపోయారు. అన్‌లాక్‌ 1లో వైరస్ విస్తృతంగా వ్యాపిస్తుంది. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలోనూ కొవిడ్ బయటపడుతోంది.

corona cases in Andhra pradesh
corona cases in Andhra pradesh

కరోనా తీవ్రత రాష్ట్రంలో నానాటికీ పెరుగుతోంది. ఓ పక్క రికార్డు సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తుండగా... మరోపక్క అదే స్థాయిలో కేసులూ నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా 497 కేసులు నమోదు కాగా 10 మంది మరణించారు. చనిపోయిన వారిలో పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన ఓ ప్రైవేటు వైద్యుడు ఉన్నారు. కొత్త వాటిని కలిపితే రాష్ట్రంలో మొత్తం కేసులు 10,331కు చేరాయి. జూన్‌ 1న అన్‌లాక్‌-1 అమల్లోకి వచ్చినప్పటి నుంచి బుధవారం వరకు అంటే 24 రోజుల్లో వచ్చిన కేసులు 6,650. చనిపోతున్న వారి సంఖ్యా పెరుగుతోంది. కొత్తగా నమోదైన మరణాలను కలిపితే రాష్ట్రంలో మృతుల సంఖ్య 129కి చేరింది. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారిలోనూ పాజిటివ్‌ కేసులు ఎక్కువగా బయట పడుతుండటం మరింత ఆందోళనకరంగా మారింది.

రాష్ట్రంలో బుధవారం తొలిసారి భారీగా 36,047 నమూనాలను పరీక్షించారు. ఇందులో స్థానికంగా 448 కేసులు వచ్చాయి. విదేశాల నుంచి వచ్చిన వారిలో 12, పొరుగు రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో 37 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా అనంతపురం జిల్లాలో ఒక్కరోజే 90 కేసులు వచ్చాయి. ఈ జిల్లాలో స్థానికంగా నమోదైన కేసులు 1,028కి చేరాయి. కొత్తగా వచ్చిన వాటితో కలిపి కృష్ణా జిల్లాలో 1,132, కర్నూలు జిల్లాలో 1,483 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో నలుగురు, కృష్ణాలో ముగ్గురు, గుంటూరు జిల్లాలో ఇద్దరు, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు మరణించారు. కృష్ణా (43), కర్నూలు (42) జిల్లాల్లో మరణాలు ఎక్కువ. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 5,423 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 4,779 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లారు.

కువైట్‌ నుంచి 314... మహారాష్ట్ర నుంచి 801

విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారిలో కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. ముఖ్యంగా కువైట్‌ నుంచి వచ్చిన వారిలో 314, మహారాష్ట్ర నుంచి వచ్చిన వారిలో 801 కేసులు తేలాయి. రాష్ట్రంలో మొత్తం 10,331 పాజిటివ్‌ కేసులు నమోదవగా, ఇందులో ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చినవారు 2,088 (20.21%) మంది. బుధవారం ఉదయం దాకా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 1,703, విదేశాల నుంచి వచ్చిన వారిలో 385 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

  • వైద్య ఆరోగ్యశాఖ జారీ చేసే రోజువారీ రాష్ట్రస్థాయి బులెటిన్‌లో... ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిని మే 5 నుంచి, విదేశాల నుంచి వచ్చినవారిని మే 24 నుంచి విడిగా చూపుతున్నారు.
  • మే 5 నుంచి జూన్‌ 24 వరకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 1,661 మందికి కరోనా సోకింది. వారిలో మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ నుంచి వచ్చింది 85.55 శాతం మంది. మే 5కు ముందు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 42 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది.
  • రాష్ట్రంలో తొలి పాజిటివ్‌ కేసు విదేశాల నుంచి వచ్చినవారి వల్లే నమోదైంది. మే 23 వరకు విదేశాల నుంచి వచ్చిన 21 మందికి కరోనా సోకగా, మే 24 నుంచి జూన్‌ 24 వరకు మరో 364 మంది ఉన్నారు. వీరిలో కువైట్‌ నుంచి వచ్చినవారే 86.26% మంది.
  • విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కరోనా రోగుల్లో మరణాలు సంభవించలేదు.

తెలంగాణలో 10 వేలకు పైనే..

తెలంగాణలో కరోనా కేసులు 10 వేలు దాటాయి. బుధవారం కొత్తగా 891 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి దాకా తెలంగాణలో ఒకరోజు నిర్ధారించిన కేసుల్లో ఇవే అత్యధికం. రాష్ట్రంలో తొలి కేసు మార్చి 2న చోటుచేసుకోగా, మే 31 నాటికి.. మూడు నెలల కాలంలో 2,698 కేసులు నమోదయ్యాయి. ఈ నెల ప్రారంభం నుంచి వైరస్‌ ఉద్ధృతి పెరిగింది. ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 10,444కి చేరుకుంది. తాజా కొవిడ్‌ కేసుల్లో అత్యధికంగా 719 జీహెచ్‌ఎంసీ(హైదరాబాద్‌) పరిధిలో నిర్ధారణ అవగా, రంగారెడ్డిలో 86, మేడ్చల్‌లో 55, భద్రాద్రి కొత్తగూడెంలో 6, ఖమ్మంలో 4, వరంగల్‌ నగర, గ్రామీణ జిల్లాల్లో 3 చొప్పున, కరీంనగర్‌, నల్గొండ, సంగారెడ్డి జిల్లాల్లో 2 చొప్పున, కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, గద్వాల, పెద్దపల్లి, సూర్యాపేట, నిజామాబాద్‌, మహబూబాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున నిర్ధారించారు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో, హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నవారు 5,858 మంది ఉండగా.. బుధవారం మరో 137 మంది ఆసుపత్రుల నుంచి డిశ్ఛార్జి అయ్యారు. తాజాగా కరోనాతో మరో ఐదుగురు మృతిచెందారు. బుధవారం ఒక్కరోజే రాష్ట్రంలో 4,069 నమూనాలను పరీక్షించారు.

కరోనాతో వైద్యుడి మృతి

మొగల్తూరు, న్యూస్‌టుడే: పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన ప్రైవేటు వైద్యుడు బుధవారం కరోనాతో మృతి చెందారు. ఆయన అనారోగ్యంతో బాధ పడుతూ ఈ నెల 23న భీమవరంలోని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి చూపించుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి ఆరోగ్యం విషమించి ఇంటి దగ్గరే మరణించారు. ఆయన మృతదేహం నుంచి నమూనాలు సేకరించారు. వాటిని భీమవరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షించగా కరోనా ఉన్నట్లు నిర్ధరణ అయింది. ఆ వైద్యుడు ఈ నెల 22 దాకా రోగులకు చికిత్సలు అందించారు. దీంతో ఆయన ప్రైమరీ, సెకండరీ కాంటాక్టు జాబితాలను సిద్ధం చేసే పనిలో పోలీసు, వైద్య సిబ్బంది ఉన్నారు.

ఇదీ చదవండి: మృతదేహాల నుంచి వైరస్​ సోకుతుందనేందుకు ఆధారాల్లేవ్: సీసీఎంబీ డైరెక్టర్

కరోనా తీవ్రత రాష్ట్రంలో నానాటికీ పెరుగుతోంది. ఓ పక్క రికార్డు సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తుండగా... మరోపక్క అదే స్థాయిలో కేసులూ నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా 497 కేసులు నమోదు కాగా 10 మంది మరణించారు. చనిపోయిన వారిలో పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన ఓ ప్రైవేటు వైద్యుడు ఉన్నారు. కొత్త వాటిని కలిపితే రాష్ట్రంలో మొత్తం కేసులు 10,331కు చేరాయి. జూన్‌ 1న అన్‌లాక్‌-1 అమల్లోకి వచ్చినప్పటి నుంచి బుధవారం వరకు అంటే 24 రోజుల్లో వచ్చిన కేసులు 6,650. చనిపోతున్న వారి సంఖ్యా పెరుగుతోంది. కొత్తగా నమోదైన మరణాలను కలిపితే రాష్ట్రంలో మృతుల సంఖ్య 129కి చేరింది. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారిలోనూ పాజిటివ్‌ కేసులు ఎక్కువగా బయట పడుతుండటం మరింత ఆందోళనకరంగా మారింది.

రాష్ట్రంలో బుధవారం తొలిసారి భారీగా 36,047 నమూనాలను పరీక్షించారు. ఇందులో స్థానికంగా 448 కేసులు వచ్చాయి. విదేశాల నుంచి వచ్చిన వారిలో 12, పొరుగు రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో 37 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా అనంతపురం జిల్లాలో ఒక్కరోజే 90 కేసులు వచ్చాయి. ఈ జిల్లాలో స్థానికంగా నమోదైన కేసులు 1,028కి చేరాయి. కొత్తగా వచ్చిన వాటితో కలిపి కృష్ణా జిల్లాలో 1,132, కర్నూలు జిల్లాలో 1,483 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో నలుగురు, కృష్ణాలో ముగ్గురు, గుంటూరు జిల్లాలో ఇద్దరు, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు మరణించారు. కృష్ణా (43), కర్నూలు (42) జిల్లాల్లో మరణాలు ఎక్కువ. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 5,423 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 4,779 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లారు.

కువైట్‌ నుంచి 314... మహారాష్ట్ర నుంచి 801

విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారిలో కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. ముఖ్యంగా కువైట్‌ నుంచి వచ్చిన వారిలో 314, మహారాష్ట్ర నుంచి వచ్చిన వారిలో 801 కేసులు తేలాయి. రాష్ట్రంలో మొత్తం 10,331 పాజిటివ్‌ కేసులు నమోదవగా, ఇందులో ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చినవారు 2,088 (20.21%) మంది. బుధవారం ఉదయం దాకా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 1,703, విదేశాల నుంచి వచ్చిన వారిలో 385 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

  • వైద్య ఆరోగ్యశాఖ జారీ చేసే రోజువారీ రాష్ట్రస్థాయి బులెటిన్‌లో... ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిని మే 5 నుంచి, విదేశాల నుంచి వచ్చినవారిని మే 24 నుంచి విడిగా చూపుతున్నారు.
  • మే 5 నుంచి జూన్‌ 24 వరకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 1,661 మందికి కరోనా సోకింది. వారిలో మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ నుంచి వచ్చింది 85.55 శాతం మంది. మే 5కు ముందు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 42 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది.
  • రాష్ట్రంలో తొలి పాజిటివ్‌ కేసు విదేశాల నుంచి వచ్చినవారి వల్లే నమోదైంది. మే 23 వరకు విదేశాల నుంచి వచ్చిన 21 మందికి కరోనా సోకగా, మే 24 నుంచి జూన్‌ 24 వరకు మరో 364 మంది ఉన్నారు. వీరిలో కువైట్‌ నుంచి వచ్చినవారే 86.26% మంది.
  • విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కరోనా రోగుల్లో మరణాలు సంభవించలేదు.

తెలంగాణలో 10 వేలకు పైనే..

తెలంగాణలో కరోనా కేసులు 10 వేలు దాటాయి. బుధవారం కొత్తగా 891 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి దాకా తెలంగాణలో ఒకరోజు నిర్ధారించిన కేసుల్లో ఇవే అత్యధికం. రాష్ట్రంలో తొలి కేసు మార్చి 2న చోటుచేసుకోగా, మే 31 నాటికి.. మూడు నెలల కాలంలో 2,698 కేసులు నమోదయ్యాయి. ఈ నెల ప్రారంభం నుంచి వైరస్‌ ఉద్ధృతి పెరిగింది. ప్రస్తుతం మొత్తం కేసుల సంఖ్య 10,444కి చేరుకుంది. తాజా కొవిడ్‌ కేసుల్లో అత్యధికంగా 719 జీహెచ్‌ఎంసీ(హైదరాబాద్‌) పరిధిలో నిర్ధారణ అవగా, రంగారెడ్డిలో 86, మేడ్చల్‌లో 55, భద్రాద్రి కొత్తగూడెంలో 6, ఖమ్మంలో 4, వరంగల్‌ నగర, గ్రామీణ జిల్లాల్లో 3 చొప్పున, కరీంనగర్‌, నల్గొండ, సంగారెడ్డి జిల్లాల్లో 2 చొప్పున, కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, గద్వాల, పెద్దపల్లి, సూర్యాపేట, నిజామాబాద్‌, మహబూబాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున నిర్ధారించారు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో, హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నవారు 5,858 మంది ఉండగా.. బుధవారం మరో 137 మంది ఆసుపత్రుల నుంచి డిశ్ఛార్జి అయ్యారు. తాజాగా కరోనాతో మరో ఐదుగురు మృతిచెందారు. బుధవారం ఒక్కరోజే రాష్ట్రంలో 4,069 నమూనాలను పరీక్షించారు.

కరోనాతో వైద్యుడి మృతి

మొగల్తూరు, న్యూస్‌టుడే: పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన ప్రైవేటు వైద్యుడు బుధవారం కరోనాతో మృతి చెందారు. ఆయన అనారోగ్యంతో బాధ పడుతూ ఈ నెల 23న భీమవరంలోని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి చూపించుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి ఆరోగ్యం విషమించి ఇంటి దగ్గరే మరణించారు. ఆయన మృతదేహం నుంచి నమూనాలు సేకరించారు. వాటిని భీమవరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షించగా కరోనా ఉన్నట్లు నిర్ధరణ అయింది. ఆ వైద్యుడు ఈ నెల 22 దాకా రోగులకు చికిత్సలు అందించారు. దీంతో ఆయన ప్రైమరీ, సెకండరీ కాంటాక్టు జాబితాలను సిద్ధం చేసే పనిలో పోలీసు, వైద్య సిబ్బంది ఉన్నారు.

ఇదీ చదవండి: మృతదేహాల నుంచి వైరస్​ సోకుతుందనేందుకు ఆధారాల్లేవ్: సీసీఎంబీ డైరెక్టర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.