ప్రధాని మోదీతో సీఎం జగన్ సమావేశం ముగిసింది. 40 నిమిషాలు భేటీ అయ్యారు. పలు కీలకాంశాలపై ప్రధానితో సీఎం చర్చించినట్లు తెలుస్తోంది. ఉదయం కేబినెట్ భేటీ అనంతరం సీఎం జగన్ దిల్లీకి పయనమయ్యారు. దిల్లీకి చేరుకున్న ముఖ్యమంత్రికి వైకాపా నేతలు స్వాగతం పలికారు. సీఎం జగన్ నేరుగా ప్రధాని నివాసానికి వెళ్లారు. సీఎంతో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి, వైకాపా నేతలు ఉన్నారు. ప్రధానితో సమావేశం ముగిసిన అనంతరం నేరుగా దిల్లీ విమానాశ్రయానికి వెళ్లారు.
![cm-jagan-tour-delhi-to-meet-pm-modi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6047259_jagan.jpg)
ఇదీ చదవండి : హస్తినకు నేడు సీఎం జగన్...ప్రధానితో సమావేశం