ETV Bharat / city

CM Jagan: వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లతో ఎన్నో ప్రయోజనాలు : సీఎం జగన్​

CM Jagan: వచ్చే వేసవిలో విద్యుత్ కొరత లేకుండా ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. అవసరమైన బొగ్గును సమకూర్చుకుని దేశీయంగా విద్యుత్ ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు ఏర్పాటు చేయడం వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయన్న సీఎం... వచ్చే ప్రయోజనాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి కోసం భారీ ప్రాజెక్టు ప్రతిపాదనలు రాష్ట్రానికి అందినట్లు అధికారులు... సీఎంకు తెలిపారు.

author img

By

Published : Oct 12, 2022, 6:51 PM IST

CM Jagan
సీఎం జగన్​

CM Jagan Review: ఇంధనశాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. బొగ్గు నిల్వలకు ఎలాంటి కొరత లేకుండా చూసుకోవాలని అధికారులను సీఎం జగన్​ ఆదేశించారు. విదేశీ బొగ్గు ధరలు మండిపోతున్న దృష్ట్యా దేశీయంగానే వీటిని సమకూర్చేకునేలా తగిన ప్రయత్నాలు చేయాలన్నారు. వేసవి కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు.

మీటర్ల బిగింపు: వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టే అంశంపై ప్రగతిపై సీఎం ఆరా తీశారు. మీటర్లు పెట్టుకునేందుకు ఇప్పటికే 16లక్షల 63 వేల 705 మంది రైతులు అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నందున.. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్‌ పంపిణీ అత్యంత పారదర్శకంగా, నాణ్యంగా, రైతులకు మేలు చేసేదిగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. అత్యంత మెరుగైన వ్యవస్థను తీసుకురావాలని నిర్దేశించారు. రైతులకు మీటర్లపై నిరంతర అవగాహన కల్పించాలన్న సీఎం... దీనివల్ల కలుగుతున్న ప్రయోజనాలపై ఎప్పటికప్పుడు రైతులకు వివరాలు అందించాలన్నారు.

రైతుల పేరు చెప్పి దొంగతనంగా విద్యుత్‌ వాడుతున్న ఘటనలు దాదాపుగా అడ్డుకోగలుగుతున్నట్లు అధికారులు తెలిపారు. మీటర్లు పెట్టడం వల్ల రైతులకు ఎంత కరెంటు అవసరమో తెలుస్తుందని సీఎం అన్నారు. దీనివల్ల సరిపడా విద్యుత్‌ను వారికి పంపిణీ చేయడానికి వీలు కలుగుతుందన్నారు. దీనివల్ల రైతుల మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవని తెలిపారు. రైతులకు ఒక్కపైసా కూడా ఖర్చు కాకుండా విద్యుత్‌ పంపిణీ సంస్థలే మీటర్లను బిగిస్తాయని సీఎం తెలిపారు. వినియోగించుకున్న విద్యుత్‌కు అయ్యే ఖర్చును నేరుగా రైతుల ఖాతాల్లోకి పంపుతారని, అక్కడనుంచి ఆ డబ్బు విద్యుత్‌ పంపిణీ సంస్థలకు చేరుతుందని సీఎం తెలిపారు. దీనివల్ల రైతులకు విద్యుత్‌ పంపిణీ సంస్థలు జవాబుదారీగా ఉంటాయన్నారు.

మోటార్లు కాలిపోయినా? నాణ్యమైన కరెంటు రాకపోయినా డిస్కంలను రైతు ప్రశ్నించగలుగుతాడని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన పైలట్‌ ప్రాజెక్టు కారణంగా రైతులకు పెద్ద ఎత్తున మేలు జరుగుతోందని, దీనివల్ల చాలా విద్యుత్‌ ఆదా అయ్యిందన్నారు. కృష్ణపట్నంలో 800 మెగావాట్ల యూనిట్‌ అందుబాటులోకి వచ్చిందని తెలిపిన అధికారులు, ఈ ప్రాజెక్టును ఇదే నెలలో ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. విజయవాడ థర్మల్‌ పవర్‌ కేంద్రంలోనూ మరో 800 మెగావాట్ల కొత్త యూనిట్‌ కూడా వచ్చే ఏడాది మార్చినాటికి పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. జగనన్న కాలనీల్లో విద్యుత్‌ సదుపాయం కల్పనపై సీఎం ఆరా తీశారు. కాలనీలు పూర్తయ్యే కొద్దీ విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలు కల్పించాలని సీఎం ఆదేశించారు. క్రమేణా ఇతర మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకుంటూ పోవాలన్నారు.

విశాఖ జిల్లా పూడిమడక సమీపంలో గ్రీన్‌ హైడ్రోజన్‌ ఇ– మెథనాల్, గ్రీన్‌ అమ్మోనియా, ఆఫ్‌ షోర్‌ విండ్‌ పవర్, హైడ్రోజన్‌ ఆధారిత విద్యుత్‌ కేంద్రాలపై 95వేల కోట్ల పెట్టుబడులు పెడతామన్న ప్రతిపాదనలు వచ్చాయని సీఎంకు అధికారులు తెలిపారు. పోలవరం విద్యుత్‌ ప్రాజెక్టులో నిర్మాణ పనుల ప్రగతిని అధికారులు తెలిపారు. ఇప్పటికే టర్బైన్‌ మోడల్‌ టెస్ట్‌ ముగిసిందని, ఇంజనీరింగ్‌ డ్రాయింగ్స్‌ వేగంగా పూర్తవుతున్నాయని తెలిపిన అధికారులు. పవర్‌ హౌస్‌లో కాంక్రీటు పనులు ముందుకు సాగుతున్నాయన్నారు. అప్పర్‌ సీలేరులో 1350 మెగావాట్ల ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్‌ పూర్తయ్యిందని అధికారులు తెలిపారు.టెండర్ల ప్రక్రియకు సిద్ధమవుతున్నట్లు వివరించారు.

ఇవీ చదవండి:

CM Jagan Review: ఇంధనశాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. బొగ్గు నిల్వలకు ఎలాంటి కొరత లేకుండా చూసుకోవాలని అధికారులను సీఎం జగన్​ ఆదేశించారు. విదేశీ బొగ్గు ధరలు మండిపోతున్న దృష్ట్యా దేశీయంగానే వీటిని సమకూర్చేకునేలా తగిన ప్రయత్నాలు చేయాలన్నారు. వేసవి కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు.

మీటర్ల బిగింపు: వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టే అంశంపై ప్రగతిపై సీఎం ఆరా తీశారు. మీటర్లు పెట్టుకునేందుకు ఇప్పటికే 16లక్షల 63 వేల 705 మంది రైతులు అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నందున.. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్‌ పంపిణీ అత్యంత పారదర్శకంగా, నాణ్యంగా, రైతులకు మేలు చేసేదిగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. అత్యంత మెరుగైన వ్యవస్థను తీసుకురావాలని నిర్దేశించారు. రైతులకు మీటర్లపై నిరంతర అవగాహన కల్పించాలన్న సీఎం... దీనివల్ల కలుగుతున్న ప్రయోజనాలపై ఎప్పటికప్పుడు రైతులకు వివరాలు అందించాలన్నారు.

రైతుల పేరు చెప్పి దొంగతనంగా విద్యుత్‌ వాడుతున్న ఘటనలు దాదాపుగా అడ్డుకోగలుగుతున్నట్లు అధికారులు తెలిపారు. మీటర్లు పెట్టడం వల్ల రైతులకు ఎంత కరెంటు అవసరమో తెలుస్తుందని సీఎం అన్నారు. దీనివల్ల సరిపడా విద్యుత్‌ను వారికి పంపిణీ చేయడానికి వీలు కలుగుతుందన్నారు. దీనివల్ల రైతుల మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవని తెలిపారు. రైతులకు ఒక్కపైసా కూడా ఖర్చు కాకుండా విద్యుత్‌ పంపిణీ సంస్థలే మీటర్లను బిగిస్తాయని సీఎం తెలిపారు. వినియోగించుకున్న విద్యుత్‌కు అయ్యే ఖర్చును నేరుగా రైతుల ఖాతాల్లోకి పంపుతారని, అక్కడనుంచి ఆ డబ్బు విద్యుత్‌ పంపిణీ సంస్థలకు చేరుతుందని సీఎం తెలిపారు. దీనివల్ల రైతులకు విద్యుత్‌ పంపిణీ సంస్థలు జవాబుదారీగా ఉంటాయన్నారు.

మోటార్లు కాలిపోయినా? నాణ్యమైన కరెంటు రాకపోయినా డిస్కంలను రైతు ప్రశ్నించగలుగుతాడని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన పైలట్‌ ప్రాజెక్టు కారణంగా రైతులకు పెద్ద ఎత్తున మేలు జరుగుతోందని, దీనివల్ల చాలా విద్యుత్‌ ఆదా అయ్యిందన్నారు. కృష్ణపట్నంలో 800 మెగావాట్ల యూనిట్‌ అందుబాటులోకి వచ్చిందని తెలిపిన అధికారులు, ఈ ప్రాజెక్టును ఇదే నెలలో ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. విజయవాడ థర్మల్‌ పవర్‌ కేంద్రంలోనూ మరో 800 మెగావాట్ల కొత్త యూనిట్‌ కూడా వచ్చే ఏడాది మార్చినాటికి పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. జగనన్న కాలనీల్లో విద్యుత్‌ సదుపాయం కల్పనపై సీఎం ఆరా తీశారు. కాలనీలు పూర్తయ్యే కొద్దీ విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలు కల్పించాలని సీఎం ఆదేశించారు. క్రమేణా ఇతర మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకుంటూ పోవాలన్నారు.

విశాఖ జిల్లా పూడిమడక సమీపంలో గ్రీన్‌ హైడ్రోజన్‌ ఇ– మెథనాల్, గ్రీన్‌ అమ్మోనియా, ఆఫ్‌ షోర్‌ విండ్‌ పవర్, హైడ్రోజన్‌ ఆధారిత విద్యుత్‌ కేంద్రాలపై 95వేల కోట్ల పెట్టుబడులు పెడతామన్న ప్రతిపాదనలు వచ్చాయని సీఎంకు అధికారులు తెలిపారు. పోలవరం విద్యుత్‌ ప్రాజెక్టులో నిర్మాణ పనుల ప్రగతిని అధికారులు తెలిపారు. ఇప్పటికే టర్బైన్‌ మోడల్‌ టెస్ట్‌ ముగిసిందని, ఇంజనీరింగ్‌ డ్రాయింగ్స్‌ వేగంగా పూర్తవుతున్నాయని తెలిపిన అధికారులు. పవర్‌ హౌస్‌లో కాంక్రీటు పనులు ముందుకు సాగుతున్నాయన్నారు. అప్పర్‌ సీలేరులో 1350 మెగావాట్ల ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్‌ పూర్తయ్యిందని అధికారులు తెలిపారు.టెండర్ల ప్రక్రియకు సిద్ధమవుతున్నట్లు వివరించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.