వైఎస్ఆర్ బీమా కింద నిధులను సీఎం జగన్ విడుదల చేశారు.
సంపాదించే వ్యక్తి మరణిస్తే కుటుంబానికి తోడుగా నిలబడాలి. అలాంటి కుటుంబానికి తోడుగా నిలబడాలనే వైఎస్ఆర్ బీమా పథకం. 12,039 కుటుంబాలకు అర్హత ఉన్నా బీమా రాని పరిస్థితి. బీమా కంపెనీల నుంచి రాకున్నా ప్రభుత్వం ఇచ్చేలా నిర్ణయం. మానవతా దృక్పథంతో 12,039 కుటుంబాలను ఆదుకుంటున్నాం. బీమా పరిహారం చెల్లింపు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతోంది. గతేడాది అక్టోబర్ 21న బ్యాంకులకు రూ.510 కోట్లు పూర్తిగా చెల్లించాం. బ్యాంకు ఖాతాలు చేయించాలని ఇప్పుడు నిబంధన పెట్టారు. వాలంటీర్లు కష్టపడి ఇప్పటివరకు 62 లక్షల ఖాతాలు తెరిపించారు. 45 రోజుల్లోపు చనిపోతే ప్రీమియం ఇవ్వబోమని మెలిక పెట్టారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కార్యక్రమం కొనసాగిస్తున్నాం. అందరికీ బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేయించాలని కోరుతున్నా. బీమా పథకానికి కేంద్రం నుంచి సహాయ నిరాకరణ జరుగుతోంది.- ముఖ్యమంత్రి జగన్
ఇదీ చదవండి: కృష్ణా నది రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన