ETV Bharat / city

'200 మంది మహిళల్ని మోసగించాడు.. ఎలా చేశాడంటే..' - నిజామాబాద్ జిల్లా వార్తలు

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో తెలంగాణ సోషల్ సర్వీస్ పేరు చెప్పి డబ్బుల రూపంలో సుమారు 200 మంది మహిళలను మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెంటనే నిందితుడు పవన్ కుమార్​ను అదుపులోకి తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

telengana news
'200 మంది మహిళల్ని మోసగించాడు.. ఎలా చేశాడంటే..'
author img

By

Published : May 31, 2020, 12:23 AM IST

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం(వై) గ్రామానికి చెందిన పవన్ కుమార్ తెలంగాణ సోషల్ సర్వీస్ సంస్థ పేరిట డబ్బులు దండుకున్నాడని బాధిత మహిళలు ఠాణాలో ఫిర్యాదు చేశారు. అంబం గ్రామానికి చెందిన గైని లక్ష్మణ్, ఎంబడి ప్రసాద్ సెల్​ఫోన్​లో తెలంగాణ సోషల్ సర్వీస్ వాట్సాప్ గ్రూపు​ను నిర్వహిస్తూ మహిళల నమ్మిస్తూ డబ్బుల రూపంలో దోచుకున్నారు. నిజామాబాద్, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన మహిళల నుంచి సుమారు రెండు లక్షల 30 వేల రూపాయల దోపిడీకి పాల్పడినట్లు బాధితురాలు, తెరాస నేత శీలం సరస్వతి, నాగమణి వాపోయారు.

డబ్బులు ఇస్తే పదవులిప్పిస్తాం..

ప్రధానంగా పవన్ కుమార్ సోషల్ సర్వీస్ వాట్సాప్ గ్రూప్​లో వారిని ఉద్దేశిస్తూ తాను తెలంగాణ సోషల్ సర్వీస్ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడినని.. సర్వీస్​లో చేరాలంటే ఒక్కో మహిళ సుమారు 3000 నుంచి 4000 రూపాయలు చెల్లిస్తే సంస్థ తరఫున రాష్ట్ర స్థాయిలో మహిళలకు అధ్యక్ష కార్యదర్శి పదవులు.. జిల్లా స్థాయిలో తెరాస కార్యవర్గ పదవులను ఇప్పించేందుకు కృషి చేస్తానని నమ్మబలికాడు.

అబలలకు మాయమాటలు !

దాదాపు 200 మంది మహిళల నుంచి సుమారు రూ. 2 లక్షల 30 వేల రూపాయలు వసూలు చేసి తమను మోసం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 21న మధ్యాహ్నం సమయంలో హైదరాబాద్​కు చెందిన తెరాస నేత సరస్వతి, ఉమా మరికొందరు మహిళలు హైదరాబాద్ నుంచి అంబ గ్రామానికి చేరుకున్నారు.

స్థానిక సర్పంచ్ సమక్షంలో పవన్ కుమార్​ను నిలదీయగా అసలు విషయం బయటపడిందని సరస్వతి వెల్లడించారు. తమ డబ్బులు తమకు తిరిగి ఇవ్వాలని మహిళలు ఒత్తిడి తేవడం వల్ల పవన్ గ్రామ పంచాయతీ వద్ద బాధితులపై దాడి చేసి పెట్రోల్ పోసుకున్నాడని ఆమె పేర్కొన్నారు. అనంతరం తమపైనా పెట్రోల్ పోసి పరారయ్యాడని వివరించారు.

రౌడీషీటర్​ పవన్​ను అరెస్ట్ చేయాలి..

నిందితుడు పవన్ కుమార్ స్త్రీల అశ్లీల చిత్రాలను ఫోన్లో చిత్రీకరిస్తూ సదరు వీడియోలు తెరాస నాయకురాళ్లవంటూ అనేక నేరాలకు పాల్పడ్డాడని అన్నారు. రౌడీషీటర్​గానూ పేరున్న పవన్ కుమార్​ను అతనికి సహకరించిన మరో ఇద్దరు వ్యక్తులను పట్టుకుని తమకు న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

తెరాస పేరు చెప్పుకుని సుమారు రెండు మందిని ఆర్థికంగా మోసం చేసిన పవన్​ను వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు. ఇటువంటి ఘరానా మోసగాడిపై చాలా కేసులు ఉన్నాయని.. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎస్సై ఎల్లయ్య గౌడ్​కు ఫిర్యాదు అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.

ఇది చదవండి 'వైకాపా ఏడాది పాలనలో ఏమున్నది గర్వకారణం'

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం(వై) గ్రామానికి చెందిన పవన్ కుమార్ తెలంగాణ సోషల్ సర్వీస్ సంస్థ పేరిట డబ్బులు దండుకున్నాడని బాధిత మహిళలు ఠాణాలో ఫిర్యాదు చేశారు. అంబం గ్రామానికి చెందిన గైని లక్ష్మణ్, ఎంబడి ప్రసాద్ సెల్​ఫోన్​లో తెలంగాణ సోషల్ సర్వీస్ వాట్సాప్ గ్రూపు​ను నిర్వహిస్తూ మహిళల నమ్మిస్తూ డబ్బుల రూపంలో దోచుకున్నారు. నిజామాబాద్, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన మహిళల నుంచి సుమారు రెండు లక్షల 30 వేల రూపాయల దోపిడీకి పాల్పడినట్లు బాధితురాలు, తెరాస నేత శీలం సరస్వతి, నాగమణి వాపోయారు.

డబ్బులు ఇస్తే పదవులిప్పిస్తాం..

ప్రధానంగా పవన్ కుమార్ సోషల్ సర్వీస్ వాట్సాప్ గ్రూప్​లో వారిని ఉద్దేశిస్తూ తాను తెలంగాణ సోషల్ సర్వీస్ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడినని.. సర్వీస్​లో చేరాలంటే ఒక్కో మహిళ సుమారు 3000 నుంచి 4000 రూపాయలు చెల్లిస్తే సంస్థ తరఫున రాష్ట్ర స్థాయిలో మహిళలకు అధ్యక్ష కార్యదర్శి పదవులు.. జిల్లా స్థాయిలో తెరాస కార్యవర్గ పదవులను ఇప్పించేందుకు కృషి చేస్తానని నమ్మబలికాడు.

అబలలకు మాయమాటలు !

దాదాపు 200 మంది మహిళల నుంచి సుమారు రూ. 2 లక్షల 30 వేల రూపాయలు వసూలు చేసి తమను మోసం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 21న మధ్యాహ్నం సమయంలో హైదరాబాద్​కు చెందిన తెరాస నేత సరస్వతి, ఉమా మరికొందరు మహిళలు హైదరాబాద్ నుంచి అంబ గ్రామానికి చేరుకున్నారు.

స్థానిక సర్పంచ్ సమక్షంలో పవన్ కుమార్​ను నిలదీయగా అసలు విషయం బయటపడిందని సరస్వతి వెల్లడించారు. తమ డబ్బులు తమకు తిరిగి ఇవ్వాలని మహిళలు ఒత్తిడి తేవడం వల్ల పవన్ గ్రామ పంచాయతీ వద్ద బాధితులపై దాడి చేసి పెట్రోల్ పోసుకున్నాడని ఆమె పేర్కొన్నారు. అనంతరం తమపైనా పెట్రోల్ పోసి పరారయ్యాడని వివరించారు.

రౌడీషీటర్​ పవన్​ను అరెస్ట్ చేయాలి..

నిందితుడు పవన్ కుమార్ స్త్రీల అశ్లీల చిత్రాలను ఫోన్లో చిత్రీకరిస్తూ సదరు వీడియోలు తెరాస నాయకురాళ్లవంటూ అనేక నేరాలకు పాల్పడ్డాడని అన్నారు. రౌడీషీటర్​గానూ పేరున్న పవన్ కుమార్​ను అతనికి సహకరించిన మరో ఇద్దరు వ్యక్తులను పట్టుకుని తమకు న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

తెరాస పేరు చెప్పుకుని సుమారు రెండు మందిని ఆర్థికంగా మోసం చేసిన పవన్​ను వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు. ఇటువంటి ఘరానా మోసగాడిపై చాలా కేసులు ఉన్నాయని.. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎస్సై ఎల్లయ్య గౌడ్​కు ఫిర్యాదు అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.

ఇది చదవండి 'వైకాపా ఏడాది పాలనలో ఏమున్నది గర్వకారణం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.