ETV Bharat / city

కోడెల వర్థంతిని అడ్డుకోవడం దుర్మార్గం: చంద్రబాబు

author img

By

Published : Sep 16, 2020, 12:28 PM IST

వైకాపా ప్రభుత్వం తీరుపై తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సభాపతి కోడెల ప్రథమ వర్ధంతి కార్యక్రమాలను కూడా అడ్డుకోవాలనుకోవడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. ఇవాళ కోడెల ప్రథమ వర్థంతి సందర్భంగా చంద్రబాబు, లోకేశ్ నివాళులర్పించారు.

Chandrababu Naidu
Chandrababu Naidu
  • డాక్టరుగా పలనాటి ముద్దుబిడ్డ అయ్యారు. రాజకీయ నేతగా పల్నాటి పులి అనిపించుకున్నారు. 36ఏళ్ళ పాటు తెలుగుదేశం పార్టీతో ఉండి ప్రజల కష్టనష్టాలలో అండగా నిలిచిన నేత కోడెల శివప్రసాదరావుగారు. అటువంటి నేత ఈరోజు మనమధ్య లేకపోవడం రాష్ట్ర రాజకీయాలకే తీరనిలోటు. (1/4) pic.twitter.com/itnz68VapQ

    — N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) September 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రాజకీయ కక్షసాధింపులతో కోడెలను బలితీసుకొని, ఇప్పుడు ఆయన ప్రథమ వర్ధంతి కార్యక్రమాలను సైతం అడ్డుకోవాలనుకోవడం ప్రభుత్వ దుర్మార్గపు చర్య అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆగ్రహించారు. మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆ ప్రజానేత స్మృతికి నివాళులర్పిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. 36 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీతో ఉండి ప్రజల కష్టనష్టాలలో అండగా నిలిచిన నేత కోడెల అని గుర్తుచేశారు.

  • డాక్టరుగా పేదలకు సేవచేయడంతో పాటు, పల్నాటి రౌడీ రాజకీయాలకు చికిత్సచేసి శాంతిని, అభివృద్ధిని అందించి, ఆరోగ్యకర సమాజానికి బాటలు వేసిన పొలిటికల్ డాక్టర్ కీర్తిశేషులు కోడెల శివప్రసాదరావుగారు. అవినీతిపరుల కక్షలు, కుట్రల కారణంగా ఆయన మనకు దూరమై ఏడాది గడిచింది.(1/2) pic.twitter.com/fHpTrFJRr5

    — Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) September 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అవినీతిపరుల కక్షలు, కుట్రల కారణంగా కోడెల మనకు దూరమై ఏడాది గడిచిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. డాక్టరుగా పేదలకు సేవచేయడమే కాక, పల్నాటి రౌడీ రాజకీయాలకు చికిత్సచేసి శాంతిని, అభివృద్ధిని అందించారని కొనియాడారు. మూడున్నర దశాబ్దాల రాజకీయజీవితంలో ఎన్‌టీఆర్‌, చంద్రబాబు మంత్రి వర్గాల్లో పనిచేసి మచ్చలేని నాయకుడిగా పేరుపొందారని కీర్తించారు.

ఇదీ చదవండి:

నాలుగు సింహాల్లో ఒక్క సింహం ప్రతిమే మిగిలింది: వీర్రాజు

  • డాక్టరుగా పలనాటి ముద్దుబిడ్డ అయ్యారు. రాజకీయ నేతగా పల్నాటి పులి అనిపించుకున్నారు. 36ఏళ్ళ పాటు తెలుగుదేశం పార్టీతో ఉండి ప్రజల కష్టనష్టాలలో అండగా నిలిచిన నేత కోడెల శివప్రసాదరావుగారు. అటువంటి నేత ఈరోజు మనమధ్య లేకపోవడం రాష్ట్ర రాజకీయాలకే తీరనిలోటు. (1/4) pic.twitter.com/itnz68VapQ

    — N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) September 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రాజకీయ కక్షసాధింపులతో కోడెలను బలితీసుకొని, ఇప్పుడు ఆయన ప్రథమ వర్ధంతి కార్యక్రమాలను సైతం అడ్డుకోవాలనుకోవడం ప్రభుత్వ దుర్మార్గపు చర్య అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆగ్రహించారు. మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆ ప్రజానేత స్మృతికి నివాళులర్పిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. 36 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీతో ఉండి ప్రజల కష్టనష్టాలలో అండగా నిలిచిన నేత కోడెల అని గుర్తుచేశారు.

  • డాక్టరుగా పేదలకు సేవచేయడంతో పాటు, పల్నాటి రౌడీ రాజకీయాలకు చికిత్సచేసి శాంతిని, అభివృద్ధిని అందించి, ఆరోగ్యకర సమాజానికి బాటలు వేసిన పొలిటికల్ డాక్టర్ కీర్తిశేషులు కోడెల శివప్రసాదరావుగారు. అవినీతిపరుల కక్షలు, కుట్రల కారణంగా ఆయన మనకు దూరమై ఏడాది గడిచింది.(1/2) pic.twitter.com/fHpTrFJRr5

    — Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) September 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అవినీతిపరుల కక్షలు, కుట్రల కారణంగా కోడెల మనకు దూరమై ఏడాది గడిచిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. డాక్టరుగా పేదలకు సేవచేయడమే కాక, పల్నాటి రౌడీ రాజకీయాలకు చికిత్సచేసి శాంతిని, అభివృద్ధిని అందించారని కొనియాడారు. మూడున్నర దశాబ్దాల రాజకీయజీవితంలో ఎన్‌టీఆర్‌, చంద్రబాబు మంత్రి వర్గాల్లో పనిచేసి మచ్చలేని నాయకుడిగా పేరుపొందారని కీర్తించారు.

ఇదీ చదవండి:

నాలుగు సింహాల్లో ఒక్క సింహం ప్రతిమే మిగిలింది: వీర్రాజు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.