ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రజాచైతన్య యాత్రలో పాల్గొనేందుకు వెళ్తున్న చంద్రబాబుకు హనుమాన్ జంక్షన్ వద్ద అభిమానులు ఘనస్వాగతం పలికారు. చంద్రబాబు అభయాంజనేయస్వామిని దర్శించుకున్నారు. యాత్రలో భాగంగా విజయవాడ నుంచి ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, రావులపాలెం మీదుగా బస్సుయాత్ర నిర్వహించి రాజమహేంద్రవరం చేరుకోనున్నారు.