ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చొరవతో రాష్ట్రంలో ధాన్యం సేకరణ, చెల్లింపుల నిధులను కేంద్రం విడుదల చేసింది. ఈ మేరకు ఎఫ్సీఐకు రూ.2,498.89 కోట్లు విడుదల చేసింది. ఎఫ్సీఐ ఈ మొత్తాన్ని ఏపీ పౌరసరఫరాల శాఖకు బదిలీ చేయనుంది. రాష్ట్రంలో రైతుల వద్ద నుంచి ధాన్యం సేకరణ, చెల్లింపుల విషయంలో వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలపై సంబంధిత మంత్రులతో ఉపరాష్ట్రపతి ఇటీవల చర్చించారు. ఎఫ్సీఐ, పౌరసరఫరాల శాఖ అధికారులతోనూ చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో నిధులు ఇస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. నిధుల విడుదలపై వెంకయ్య హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: