కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని పంచాయతీ ఎన్నికల్లో కొందరు పోలీసులు.. బెదిరింపులకు దిగడం అత్యంత హేయమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తమ పార్టీ సానుభూతిపరులు వేసిన నామినేషన్లను ఉపసంహరించుకోవాలని బెదిరింపులకు దిగడం దారుణమన్నారు. సింహాద్రిపురం మండలం నంద్యాలపల్లి పంచాయతీలో సోమశేఖర్రెడ్డి సహా తమ పార్టీ కార్యకర్తలను అక్రమంగా అదుపులోకి తీసుకుని ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేశారన్నారు. తప్పుడు కేసుల్లో ఇరికించారని ఆరోపించారు. పోలీసు వ్యవస్థ ఔన్నత్యాన్ని దెబ్బతీసేలా దుర్మార్గులకు అండగా నిలిచేవారిని ప్రజలు సహించరని చంద్రబాబు హెచ్చరించారు.
ఇదీ చదవండి: ఆమరణ దీక్ష కొనసాగిస్తా : తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు