ETV Bharat / city

తెదేపా ఎమ్మెల్యే అరెస్టుపై గవర్నర్​కు చంద్రబాబు లేఖ

author img

By

Published : Apr 7, 2020, 5:11 PM IST

రైతుల సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్​ను కోరేందుకు వెళ్తోన్న తమ ఎమ్మెల్యేను అక్రమంగా అరెస్టు చేశారని తెదేపా అధినేత చంద్రబాబు గవర్నర్​కు లేఖరాశారు. కలెక్టర్ ఫోనులో స్పందించకపోవటం వల్లే ఎమ్మెల్యే ఏలూరుకు వెళ్లేందుకు ప్రయత్నించారన్నారు. వందల మందితో వైకాపా ఎమ్మెల్యేలు సమావేశాలు నిర్వహించినా వారిపై చర్యలు లేవని లేఖలో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యల పరిష్కారానికి జోక్యం చేసుకోవాలని గవర్నర్​ను కోరారు.

Cbn letter to governor on mla arrest
గవర్నర్​కు చంద్రబాబు లేఖ
గవర్నర్​కు చంద్రబాబు లేఖ

రాష్ట్ర గవర్నర్​కు బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరితే తమ ఎమ్మెల్యేను అక్రమంగా అరెస్ట్‌ చేశారని చంద్రబాబు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఫోన్‌లో కలెక్టర్‌ స్పందించకపోవడం వల్ల నేరుగా వెళ్లి కలవాలని ఎమ్మెల్యే నిర్ణయించుకున్నారని వివరించారు. కలెక్టర్‌ను కలిసి నేరుగా వినతిపత్రం ఇవ్వాలని ఎమ్మెల్యే రామానాయుడు ప్రయత్నించారని చెప్పారు. భీమవరం వద్ద ఆయనను పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపారన్నారు.

ఈ సమయంలో నరసాపురం, భీమవరం వైకాపా ఎమ్మెల్యేలు వందలాది మందితో సమావేశం నిర్వహించారని పేర్కొన్నారు. వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. పశుసంవర్థక శాఖమంత్రి, జిల్లా కలెక్టర్‌ సైతం 200 మందితో సమావేశం నిర్వహిస్తే వారిపైనా ఎలాంటి చర్యలు లేవని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు. రైతు సమస్యల పరిష్కారానికి జోక్యం చేసుకోవాలని చంద్రబాబు... గవర్నర్‌ను కోరారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

స్థానికుల ఫిర్యాదు... అధికారులపై మంత్రి ఆగ్రహం

గవర్నర్​కు చంద్రబాబు లేఖ

రాష్ట్ర గవర్నర్​కు బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరితే తమ ఎమ్మెల్యేను అక్రమంగా అరెస్ట్‌ చేశారని చంద్రబాబు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఫోన్‌లో కలెక్టర్‌ స్పందించకపోవడం వల్ల నేరుగా వెళ్లి కలవాలని ఎమ్మెల్యే నిర్ణయించుకున్నారని వివరించారు. కలెక్టర్‌ను కలిసి నేరుగా వినతిపత్రం ఇవ్వాలని ఎమ్మెల్యే రామానాయుడు ప్రయత్నించారని చెప్పారు. భీమవరం వద్ద ఆయనను పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపారన్నారు.

ఈ సమయంలో నరసాపురం, భీమవరం వైకాపా ఎమ్మెల్యేలు వందలాది మందితో సమావేశం నిర్వహించారని పేర్కొన్నారు. వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. పశుసంవర్థక శాఖమంత్రి, జిల్లా కలెక్టర్‌ సైతం 200 మందితో సమావేశం నిర్వహిస్తే వారిపైనా ఎలాంటి చర్యలు లేవని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు. రైతు సమస్యల పరిష్కారానికి జోక్యం చేసుకోవాలని చంద్రబాబు... గవర్నర్‌ను కోరారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

స్థానికుల ఫిర్యాదు... అధికారులపై మంత్రి ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.