ఏపీ ప్రభుత్వం తనను సస్పెండ్ చేయటాన్ని సవాల్ చేస్తూ... కృష్ణకిషోర్ దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ మరోసారి విచారణ జరిగింది. ఐఆర్ఎస్ అధికారి సస్పెండ్పై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. జాస్తి కృష్ణకిషోర్ సస్పెన్షన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర సర్వీసులకు తిరిగి వెళ్తానన్న అధికారిపై ఎందుకు సస్పెన్షన్ విధించారని ప్రశ్నించింది. ఉద్దేశపూర్వకంగానే కృష్ణకిషోర్కు హాని కలిగించేలా వ్యవహరిస్తున్నారని క్యాట్ వ్యాఖ్యానించంది. కృష్ణకిషోర్పై పలు ఆరోపణలు ఉన్నందునే సస్పెండ్ చేసినట్లు ప్రతివాదిగా ఉన్న ప్రభుత్వం వాదించింది. డిప్యూటేషన్ పూర్తయ్యేవరకూ వెనక్కి వెళ్లడానికి వీల్లేదని ప్రభుత్వం వాదనలు వినిపించింది.
ఇదీ చదవండి: 'ఈ పాలన మాకొద్దు.. మా జిల్లాలు తెలంగాణలో కలపండి'