ETV Bharat / city

సచివాలయానికి 30 శాతం ఉద్యోగులే హాజరు

author img

By

Published : Mar 23, 2020, 2:30 PM IST

కరోనా వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర సచివాలయానికి ఉద్యోగులు 30 శాతం మంది మాత్రమే హాజరయ్యారు. ఉద్యోగులు , సందర్శకులు లేకపోవటంతో సచివాలయ ప్రాంగణం, విభాగాలన్నీ బోసిపోయాయి.

carona effect in sachivalayam
carona effect in sachivalayam

కరోనా వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా కొంతమంది ఉద్యోగులే సచివాలయానికి హాజరయ్యారు. 30 శాతం మంది ఉద్యోగులు మాత్రమే రావడంతో.. సచివాలయం వెలవెలబోయింది. వర్క్ ఫ్రమ్ హోం కారణంగా బ్లాక్‌లు అన్ని ఖాళీగా ఉన్నాయి. సందర్శకులకు అనుమతి లేదని సచివాలయం వెలుపల బోర్డులు పెట్టారు. హైదరాబాద్ నుంచి రావాల్సిన సచివాలయ ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రజా రవాణా, ఆర్టీసీ బస్సులు నిలిపివేయటంతో పరిమిత సంఖ్యలో ఉద్యోగులూ సొంత వాహనాలపైనే హాజరవుతున్నారు.

కరోనా వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా కొంతమంది ఉద్యోగులే సచివాలయానికి హాజరయ్యారు. 30 శాతం మంది ఉద్యోగులు మాత్రమే రావడంతో.. సచివాలయం వెలవెలబోయింది. వర్క్ ఫ్రమ్ హోం కారణంగా బ్లాక్‌లు అన్ని ఖాళీగా ఉన్నాయి. సందర్శకులకు అనుమతి లేదని సచివాలయం వెలుపల బోర్డులు పెట్టారు. హైదరాబాద్ నుంచి రావాల్సిన సచివాలయ ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రజా రవాణా, ఆర్టీసీ బస్సులు నిలిపివేయటంతో పరిమిత సంఖ్యలో ఉద్యోగులూ సొంత వాహనాలపైనే హాజరవుతున్నారు.

ఇదీ చదవండి: 'ఎయిర్ ​ఇండియా' తెగువకు ప్రధాని ప్రశంసలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.