ETV Bharat / city

'రాజధానికి చిరునామా లేకుండా చేసింది చంద్రబాబే..'

author img

By

Published : Nov 5, 2019, 4:02 PM IST

తెదేపా అధినేత చంద్రబాబు..రాజధానికి చిరునామా లేకుండా చేశారని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. గత ప్రభుత్వ వైఫల్యాల వల్లే రాజధానికి ఈ పరిస్థితి వచ్చిందన్న ఆయన.. రాజధాని, ప్రాజెక్టులపై కమిటీ వేశామని తెలిపారు. నివేదిక వచ్చాక రాజధాని వివరాలు చెబుతామన్నారు. తమ ప్రభుత్వంపై చంద్రబాబు అనవసర ఆరోపణలు చేయకుండా భాష మార్చుకుని మాట్లాడాలని అన్నారు.

bosta-comments-on-chandrababu
'రాజధానికి చిరునామా లేకుండా చేసింది చంద్రబాబే..'

తెదేపా అధినేత చంద్రబాబు.... ఆంధ్రప్రదేశ్ రాజధానికి చిరునామా లేకుండా చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. సర్వే ఆఫ్ ఇండియా..... భారతదేశ రాజకీయ పటాన్ని విడుదల చేస్తే అందులో ఏపీ రాజధాని పేరే లేదని... ఇది పూర్తిగా గత ప్రభుత్వ వైఫల్యమని బొత్స వ్యాఖ్యానించారు. తెదేపాలో పనిచేసి భాజపాలో చేరిన వ్యక్తులు రాజధానిపై ఇప్పుడు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని, రాష్ట్రంలోని ప్రాజెక్టుల అభివృద్ధిపై కమిటీ వేశామని... నివేదిక వచ్చాక రాజధాని వివరాలు చెబుతామని బొత్స తెలిపారు. సీఎస్ బదిలీపై స్పందిస్తూ... ఈ చర్య పాలనా వ్యవహారాల్లో భాగమని, చర్చించాల్సిన అంశం కాదని బొత్స అన్నారు.

'రాజధానికి చిరునామా లేకుండా చేసింది చంద్రబాబే..'

తెదేపా అధినేత చంద్రబాబు.... ఆంధ్రప్రదేశ్ రాజధానికి చిరునామా లేకుండా చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. సర్వే ఆఫ్ ఇండియా..... భారతదేశ రాజకీయ పటాన్ని విడుదల చేస్తే అందులో ఏపీ రాజధాని పేరే లేదని... ఇది పూర్తిగా గత ప్రభుత్వ వైఫల్యమని బొత్స వ్యాఖ్యానించారు. తెదేపాలో పనిచేసి భాజపాలో చేరిన వ్యక్తులు రాజధానిపై ఇప్పుడు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని, రాష్ట్రంలోని ప్రాజెక్టుల అభివృద్ధిపై కమిటీ వేశామని... నివేదిక వచ్చాక రాజధాని వివరాలు చెబుతామని బొత్స తెలిపారు. సీఎస్ బదిలీపై స్పందిస్తూ... ఈ చర్య పాలనా వ్యవహారాల్లో భాగమని, చర్చించాల్సిన అంశం కాదని బొత్స అన్నారు.

ఇదీ చూడండి:

'మూడేళ్లు.. మూడు దశలు.. నాడు-నేడు కార్యక్రమం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.