- ప్రకాశం బ్యారేజ్కి పోటెత్తిన వరద.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
ప్రకాశం బ్యారేజ్కు వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి ప్రవాహం అంతకంతకూ పెరుగుతుండడంతో.. బ్యారేజ్ నిండుకుండలా మారింది. దీంతో మొత్తం 70 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కడప జిల్లాలో నడయాడిన మహాత్ముడు.. స్మరించుకుంటున్న స్థానికులు
ఎందరో పోరాటయోధుల త్యాగఫలమే దేశానికి స్వాతంత్య్ర సిద్ధి. బ్రిటీష్ పాలకుల బానిస సంకెళ్ల నుంచి విముక్తి పొంది 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా దేశం ఆజాదీకా అమృత్ మహోత్సవాలను ఘనంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మాగాంధీ ఉమ్మడి కడప జిల్లాలో పర్యటించిన మధుర జ్ఞాపకాలను స్వాతంత్య్ర సమరయోధులు స్మరించుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఎంపీ మాధవ్ వీడియో వ్యవహారంపై నేడు గవర్నర్ను కలవనున్న అఖిలపక్ష మహిళా ఐకాస..
హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో విషయమై నేడు గవర్నర్ బిశ్వభూషణ్ను అఖిలపక్ష మహిళా ఐకాస కలవనుంది. వీడియో వ్యవహారంపై ఫిర్యాదు చేయడంతో పాటు.. ఎస్పీ వ్యాఖ్యలను కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జలాశయాలకు వరద పోటు.. తెరుచుకున్న గేట్లు..
ధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. బ్యారేజీకి వరద ప్రవాహం భారీగా పెరగడంతో.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజ్ ప్రస్తుత నీటిమట్టం 15 అడుగులకు చేరింది. దీంతో.. సముద్రంలోకి 14 లక్షల 70 వేల క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'మీకో నమస్కారం.. ప్రధాని రేసులో నేను లేను.. ఇక దయచేసి వదిలేయండి'..
దేశవ్యాప్తంగా ఉన్న విపక్ష పార్టీలను ఐక్యం చేసేందుకు తాను ప్రయత్నిస్తామని బిహార్ సీఎం నీతీశ్ కుమార్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మోదీకి ప్రత్యర్థిగా విపక్షాల కూటమి తరపున నీతీశ్ పోటీ చేస్తారని వస్తున్న వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తనకు అలాంటి ఆలోచనలు లేవని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వావివరసలు మరిచి చెల్లెలిపై సోదరులు రేప్.. స్నానం చేస్తుండగా వీడియో తీసి..
మహిళలు, చిన్నారులపై అకృత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వావివరసలు మరచిన కామాంధులు.. సొంతవారినీ వదలడం లేదు. నిత్యం ఏదో ఒకచోట ఇలాంటి దారుణాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అచ్చం అలాంటి ఘటనే బిహార్లో జరిగింది. చెల్లెలు వరసయ్యే 15 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు సోదరులు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- RakshaBandhan: తోబుట్టువులతో సినీ, క్రీడా తారలు.. సెలబ్రేషన్స్ సూపర్..
దేశవ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తమ ప్రియమైన సోదరుడికి ఇంటి ఆడపడుచులు రాఖీ కట్టి అతడి క్షేమాన్ని కోరుకుంటున్నారు. ఈ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని సినీ, క్రీడా ప్రముఖులు సైతం తమ ఇళ్లలో జరిగిన రక్షాబంధన్ వేడుకలు జరిపి.. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్మీడియాలో షేర్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రపంచం అంతా ఓవైపు.. టీమ్ఇండియా మరోవైపు.. క్రికెట్ మ్యాచ్ ఎప్పుడంటే?..
ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా.. ఇండియా వర్సెస్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. వచ్చే నెల ఈ మ్యాచ్ జరగనుంది. ఇండియాకు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కెప్టెన్కు వ్యవహరించనున్నాడు. ప్రతిష్టాత్మక కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ను బీసీసీఐ నిర్వహిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అద్దెపై 18% జీఎస్టీ అందరూ కట్టాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?..
అద్దెపై 18 శాతం జీఎస్టీ.. ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త నిబంధన. ఇది అందరికీ వర్తిస్తుందా? నెలనెలా అద్దెతోపాటు జీఎస్టీ భారం కూడా తప్పదా? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'శాంసంగ్' వారసుడికి క్షమాభిక్ష.. జైలు నుంచి విముక్తి.. ఇక బిజినెస్పై దృష్టి..
లంచం కేసులో దోషిగా తేలి జైలు శిక్ష ఎదుర్కొంటున్న ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ వారసుడు లీ జే యాంగ్కు దక్షిణ కొరియా ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టింది. ప్రభుత్వ నిర్ణయంతో మరో ఏడాది జైలు శిక్ష ఉండగానే.. జే యాంగ్కు కేసు నుంచి విముక్తి లభించింది. త్వరలోనే యాంగ్ సామ్సంగ్ కంపెనీ బోర్డులో చేరి, పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.