ETV Bharat / city

AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 9PM

author img

By

Published : May 22, 2022, 9:01 PM IST

.

Topnews
Topnews
  • Jagan davos Tour: దావోస్​లో ఏపీ పెవిలియన్​ను ప్రారంభించిన సీఎం జగన్
    దావోస్‌ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జగన్‌.. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్‌ను జగన్​ ఆవిష్కరించారు. అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతం అదానీ సీఎం జగన్​తో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • పోలవరం డయాఫ్రమ్ వాల్ పునర్నిర్మాణానికి కార్యాచరణ సిద్ధం: జలశక్తి శాఖ సలహాదారు
    పోలవరంలో డయాఫ్రమ్ వాల్ పునర్నిర్మాణంపై కార్యాచరణ సిద్ధం చేశామని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ స్పష్టం చేశారు. మరో వాల్ కట్టాలా, మరమ్మతులు చేయాలనేదాన్ని పరిశీలిస్తున్నామన్నారు. సవరించిన అంచనాలను కేంద్రం పరిశీలిస్తోందని.., సోషియో ఎకనమిక్ సర్వే అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని చెప్పారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • CBN: నిందితుడు బయటే తిరుగుతున్నా.. పోలీసులకు కనిపించడం లేదా ?: చంద్రబాబు
    కారు డ్రైవర్‌ హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్‌ చేయకపోవటంపై తెదేపా అధినేత చంద్రబాబు విస్మయం వ్యక్తం చేశారు. కళ్లముందే నిందితుడు తిరుగుతున్నా.. అరెస్ట్ చేయకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. మృతిడి భార్యను ఫోన్​లో పరామర్శించిన చంద్రబాబు.. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • కేంద్ర ప్రభుత్వం తరహాలో.. వైకాపా సర్కార్​ పన్నులు తగ్గించాలి: పవన్​కల్యాణ్​
    రోజురోజుకు పెరిగిపోతున్న ధరల దాడికి బెంబేలెత్తిపోతున్న ప్రజలకు.. పెట్రోలు, డీజిల్ మీద ఎక్సైజ్​ సుంకం తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం హర్షణీయమన్నారు జనసేన అధినేత పవన్​కల్యాణ్​. రోడ్డు సెస్ పేరుతో.. వైకాపా ప్రభుత్వం ప్రజల నుంచి ఏటా రూ.600 కోట్లు వసూలు చేస్తోందని మండిపడ్డారు. అయినా రోడ్లను బాగు చేసే పరిప్థితి ప్రస్తుతం ఎలాగూ కనిపించడం లేదని ధ్వజమెత్తారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'క్వాడ్​ దేశాధినేతలకు ఈ సదస్సు గొప్ప అవకాశం'
    టోక్యో వేదికగా మరో రెండు రోజుల్లో జరగనున్న క్వాడ్​ సదస్సు.. పలు కీలక అంశాలపై చర్చించేందుకు నాలుగు దేశాల నాయకులకు గొప్ప అవకాశంగా పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. జపాన్​ పర్యటనకు బయలుదేరే ముందు క్వాడ్​ సదస్సు, జపాన్​- భారత్​ సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • కేంద్రం బాటలో రాష్ట్రాలు.. 'పెట్రో పన్ను' తగ్గింపు.. మరి మన సంగతేంటి?
    కేంద్ర ప్రభుత్వం లీటర్​పై 8 రూపాయలు, డీజిల్​పై 6 రూపాయల ఎక్సైజ్​ సుంకం తగ్గిస్తున్నట్లు శనివారం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే కేరళ, రాజస్థాన్​, మహారాష్ట్ర రాష్ట్రాలు పెట్రో ఉత్పత్తుల పన్నును తగ్గించాయి. మరోవైపు కేంద్రం నిర్ణయాన్ని పాకిస్థాన్​ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్​ఖాన్ సైతం ప్రశంసించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • లోదుస్తుల్లో వెళ్లి ఓటేసిన వందల మంది- ఆ కంపెనీ వింత ఆఫరే కారణం!
    ఆస్ట్రేలియాలో ప్రభుత్వం మారనుంది. శనివారం జరిగిన ఎన్నికల్లో విపక్ష లేబర్ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ నేత ఆంటోనీ అల్బనీస్‌ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే.. అనేక మంది ఓటర్లు అండర్​వేర్​ మాత్రమే ధరించి, పోలింగ్ కేంద్రాలకు వెళ్లడం చర్చనీయాంశమైంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • క్రెడిట్‌ కార్డులకు కొత్త నిబంధనలు.. కచ్చితంగా ఇవి తెలుసుకోండి?
    ప్రస్తుత రోజుల్లో షాపింగ్, అత్యవసరాల కోసం క్రెడిట్​ కార్డును చాలా మంది వాడుతున్నారు. అయితే వీటి వాడకంలో ఏ మాత్రం అవగాహన లేకపోయినా ఛార్జీల బాదుడు తప్పదు. అందుకే వినియోగదారుల కోసం ఆర్​బీఐ.. క్రెడిట్ కార్డు వినియోగంలో కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. అవి జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అవేంటో ఓసారి పరిశీలిద్దాం..పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • చిరు వర్సెస్​ విక్రమ్​.. ఎన్టీఆర్​-వంశీపైడిపల్లి సినిమా!
    కొత్త సినిమాలకు సంబంధించి పలు వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అందులో మెగాస్టార్​ చిరంజీవి 'గాడ్​ఫాధర్'​, విక్రమ్ 'కోబ్రా', ఎన్టీఆర్, వంశీపైడిపల్లి చిత్రాల సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • జాతీయ జట్టులోకి ఉమ్రాన్​.. పుజారా, హార్దిక్​ రిటర్న్​.. కెప్టెన్​గా రాహుల్
    దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్​ల టీ20 సిరీస్​కు జట్టును ప్రకటించింది బీసీసీఐ. రోహిత్‌, కోహ్లీ, బుమ్రా సహా పలువురు సీనియర్లకు విశ్రాంతి ఇవ్వగా.. జట్టు పగ్గాలను కేఎల్​ రాహుల్​కు అప్పగించింది. పంత్​ వైస్​ కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు. క్రికెట్ విశ్లేషకులు ఊహించిన విధంగానే జమ్ము కశ్మీర్​ పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ జాతీయ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

  • Jagan davos Tour: దావోస్​లో ఏపీ పెవిలియన్​ను ప్రారంభించిన సీఎం జగన్
    దావోస్‌ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జగన్‌.. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్‌ను జగన్​ ఆవిష్కరించారు. అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతం అదానీ సీఎం జగన్​తో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • పోలవరం డయాఫ్రమ్ వాల్ పునర్నిర్మాణానికి కార్యాచరణ సిద్ధం: జలశక్తి శాఖ సలహాదారు
    పోలవరంలో డయాఫ్రమ్ వాల్ పునర్నిర్మాణంపై కార్యాచరణ సిద్ధం చేశామని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ స్పష్టం చేశారు. మరో వాల్ కట్టాలా, మరమ్మతులు చేయాలనేదాన్ని పరిశీలిస్తున్నామన్నారు. సవరించిన అంచనాలను కేంద్రం పరిశీలిస్తోందని.., సోషియో ఎకనమిక్ సర్వే అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని చెప్పారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • CBN: నిందితుడు బయటే తిరుగుతున్నా.. పోలీసులకు కనిపించడం లేదా ?: చంద్రబాబు
    కారు డ్రైవర్‌ హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్‌ చేయకపోవటంపై తెదేపా అధినేత చంద్రబాబు విస్మయం వ్యక్తం చేశారు. కళ్లముందే నిందితుడు తిరుగుతున్నా.. అరెస్ట్ చేయకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. మృతిడి భార్యను ఫోన్​లో పరామర్శించిన చంద్రబాబు.. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • కేంద్ర ప్రభుత్వం తరహాలో.. వైకాపా సర్కార్​ పన్నులు తగ్గించాలి: పవన్​కల్యాణ్​
    రోజురోజుకు పెరిగిపోతున్న ధరల దాడికి బెంబేలెత్తిపోతున్న ప్రజలకు.. పెట్రోలు, డీజిల్ మీద ఎక్సైజ్​ సుంకం తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం హర్షణీయమన్నారు జనసేన అధినేత పవన్​కల్యాణ్​. రోడ్డు సెస్ పేరుతో.. వైకాపా ప్రభుత్వం ప్రజల నుంచి ఏటా రూ.600 కోట్లు వసూలు చేస్తోందని మండిపడ్డారు. అయినా రోడ్లను బాగు చేసే పరిప్థితి ప్రస్తుతం ఎలాగూ కనిపించడం లేదని ధ్వజమెత్తారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'క్వాడ్​ దేశాధినేతలకు ఈ సదస్సు గొప్ప అవకాశం'
    టోక్యో వేదికగా మరో రెండు రోజుల్లో జరగనున్న క్వాడ్​ సదస్సు.. పలు కీలక అంశాలపై చర్చించేందుకు నాలుగు దేశాల నాయకులకు గొప్ప అవకాశంగా పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. జపాన్​ పర్యటనకు బయలుదేరే ముందు క్వాడ్​ సదస్సు, జపాన్​- భారత్​ సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • కేంద్రం బాటలో రాష్ట్రాలు.. 'పెట్రో పన్ను' తగ్గింపు.. మరి మన సంగతేంటి?
    కేంద్ర ప్రభుత్వం లీటర్​పై 8 రూపాయలు, డీజిల్​పై 6 రూపాయల ఎక్సైజ్​ సుంకం తగ్గిస్తున్నట్లు శనివారం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే కేరళ, రాజస్థాన్​, మహారాష్ట్ర రాష్ట్రాలు పెట్రో ఉత్పత్తుల పన్నును తగ్గించాయి. మరోవైపు కేంద్రం నిర్ణయాన్ని పాకిస్థాన్​ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్​ఖాన్ సైతం ప్రశంసించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • లోదుస్తుల్లో వెళ్లి ఓటేసిన వందల మంది- ఆ కంపెనీ వింత ఆఫరే కారణం!
    ఆస్ట్రేలియాలో ప్రభుత్వం మారనుంది. శనివారం జరిగిన ఎన్నికల్లో విపక్ష లేబర్ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ నేత ఆంటోనీ అల్బనీస్‌ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే.. అనేక మంది ఓటర్లు అండర్​వేర్​ మాత్రమే ధరించి, పోలింగ్ కేంద్రాలకు వెళ్లడం చర్చనీయాంశమైంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • క్రెడిట్‌ కార్డులకు కొత్త నిబంధనలు.. కచ్చితంగా ఇవి తెలుసుకోండి?
    ప్రస్తుత రోజుల్లో షాపింగ్, అత్యవసరాల కోసం క్రెడిట్​ కార్డును చాలా మంది వాడుతున్నారు. అయితే వీటి వాడకంలో ఏ మాత్రం అవగాహన లేకపోయినా ఛార్జీల బాదుడు తప్పదు. అందుకే వినియోగదారుల కోసం ఆర్​బీఐ.. క్రెడిట్ కార్డు వినియోగంలో కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. అవి జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అవేంటో ఓసారి పరిశీలిద్దాం..పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • చిరు వర్సెస్​ విక్రమ్​.. ఎన్టీఆర్​-వంశీపైడిపల్లి సినిమా!
    కొత్త సినిమాలకు సంబంధించి పలు వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అందులో మెగాస్టార్​ చిరంజీవి 'గాడ్​ఫాధర్'​, విక్రమ్ 'కోబ్రా', ఎన్టీఆర్, వంశీపైడిపల్లి చిత్రాల సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • జాతీయ జట్టులోకి ఉమ్రాన్​.. పుజారా, హార్దిక్​ రిటర్న్​.. కెప్టెన్​గా రాహుల్
    దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్​ల టీ20 సిరీస్​కు జట్టును ప్రకటించింది బీసీసీఐ. రోహిత్‌, కోహ్లీ, బుమ్రా సహా పలువురు సీనియర్లకు విశ్రాంతి ఇవ్వగా.. జట్టు పగ్గాలను కేఎల్​ రాహుల్​కు అప్పగించింది. పంత్​ వైస్​ కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు. క్రికెట్ విశ్లేషకులు ఊహించిన విధంగానే జమ్ము కశ్మీర్​ పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ జాతీయ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.