ETV Bharat / city

AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @7PM

author img

By

Published : Apr 17, 2022, 6:58 PM IST

.

ఏపీ ప్రధాన వార్తలు
ఏపీ ప్రధాన వార్తలు
  • ప్రముఖుడి విల్లాలో మెకానిక్ మృతి.. గుట్టుచప్పుడు కాకుండా రాజీ ప్రయత్నాలు!
    గుంటూరు జిల్లా మంగళగిరి ఐజేఎం విల్లాలో ఓ ఏసీ మెకానిక్ విద్యుదాఘాతంతో మృతి చెందాడు. విల్లా ఓ ప్రముఖుడిది కావటంతో గుట్టుచప్పుడు కాకుండా మృతుడి కుటుంబ సభ్యులతో రాజీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • రాళ్లు రువ్వుకున్న ఇరు వర్గాలు.. 15 మందికి గాయాలు!
    హన్​మాన్ జయంతి వేడుకల ఊరేగింపులో ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్న ఘటనలో 15 మంది గాయాల పాలయ్యారు. ఈ ఘటన కర్నూలు జిల్లా హోళగుందలో చోటుచేసుకుంది. దీంతో.. పోలీసులు గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • లారీ-బైక్ ఢీ.. చిన్నారి సహా భార్యాభర్తలు మృతి !
    కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. యానాం-ఎదుర్లంక బాలయోగి వారధిపై ద్విచక్రవాహనాన్ని ఇసుక లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు సహా కుమారుడు మృతి చెందాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'భారత్​లో 40లక్షల కరోనా మరణాలు- కేంద్రమే కారణం!'
    కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. కరోనా విజృంభణ సమయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే దేశంలో 40 లక్షల మంది భారతీయులు మరణించారని ఆరోపించారు. ప్రతి బాధిత కుటుంబానికి రూ.4లక్షల పరిహారం అందించాలని కేంద్రాన్ని డిమాండ్​ చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'భాజపాతో కాంగ్రెస్ సీనియర్ల కుమ్మక్కు- మీ పార్టీలో ఇక నేనుండను!'
    కాంగ్రెస్ కీలక నేత రిపున్ బోరా ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను దిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి పంపారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం భాజపాతో కొట్లాడే స్థితిలో లేదని లేఖలో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • అఫ్గాన్​పై పాక్​ వాయుదాడులు.. 40 మంది మృతి
    అఫ్గానిస్థాన్​పై పాకిస్థాన్​ వైమానిక దాడులు జరిపింది. ఈ ఘటనలో 40 మందికిపైగా మృతిచెందారు. పాక్​ వైఖరిని ఖండిస్తున్నట్లు ప్రకటించింది ఆ దేశ ప్రభుత్వం. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • రికార్డ్​ స్థాయికి సీఎన్​జీ ధర.. కేంద్రం ఏమందంటే?
    దేశంలో పెట్రోల్​, డీజిల్​ ధరలతో పాటు సీఎన్​జీ గ్యాస్​ ధరలు భగ్గుమంటున్నాయి. కొద్ది రోజుల్లోనే రికార్డు స్థాయికి చేరుకున్నాయి. డిమాండ్​కు తగినట్లుగా కొత్త కేటాయింపులు లేకపోవటం వల్లే భారం పడుతోందని సిటీ గ్యాస్​ పంపిణీ విభాగాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే.. పెరిగిన డిమాండ్​కు సంబంధించిన కొత్త డేటా అందించలేదని, అప్డేటెడ్​ సమాచారం కోసం వేచి ఉన్నామని కేంద్రం పేర్కొనటం గమనార్హం. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • స్మార్ట్‌ ఫోన్లు వేడెక్కుతున్నాయా? ఈ టిప్స్​ మీ కోసమే..
    వేసవిలో ఫోన్లు హీటెక్కడం పలువురు వినియోగదారుల అనుభవంలోకి వచ్చే ఉంటుంది. ఈ కాలంలో ఎలాంటి జాగ్రత్తలతో స్మార్ట్​ఫోన్​లను సురక్షితంగా ఉంచుకోగలం? బ్యాటరీని కాపాడుకోవడం ఎలా? పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • రెడ్ మిర్చి ఘాటులా రకుల్.. ఆ డ్రెస్​ రూ.55 వేలంట!
    స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. వీకెండ్ వచ్చిందంటే చాలు.. నెట్టింట అందాలను ఆరబోస్తుంది. లేటెస్ట్ ఫొటోలతో అభిమానులకు ఊహించని ట్రీట్స్​ ఇస్తోంది. బాలీవుడ్​లో వరుస చిత్రాల్లో నటిస్తున్న రకుల్.. అక్కడి వాతావరణానికి తగ్గట్టుగానే ఫ్యాషన్​పై దృష్టి పెడుతోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'భారత్​కు ప్రపంచకప్​ అందించడమే నా లక్ష్యం'
    టీ20 ప్రపంచకప్​- 2022లో భారత్​ను జగజ్జేతగా నిలపటమే తన లక్ష్యమని వెటనర్​ బ్యాటర్​, వికెట్​ కీపర్​ దినేశ్​ కార్తీక్​ పేర్కొన్నాడు. ఐపీఎల్​లో శనివారం రాత్రి దిల్లీపై ఆర్​సీబీ విజయం సాధించటంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్​ అనంతరం విరాట్​ కోహ్లీతో ఇంటర్వ్యూలో పలు విషయాలపై మాట్లాడాడు. మరోవైపు.. దినేశ్​ కార్తీక్​పై ప్రశంసలు కురిపించాడు బెంగళూరు కెప్టెన్​ డూప్లిసెస్​. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

  • ప్రముఖుడి విల్లాలో మెకానిక్ మృతి.. గుట్టుచప్పుడు కాకుండా రాజీ ప్రయత్నాలు!
    గుంటూరు జిల్లా మంగళగిరి ఐజేఎం విల్లాలో ఓ ఏసీ మెకానిక్ విద్యుదాఘాతంతో మృతి చెందాడు. విల్లా ఓ ప్రముఖుడిది కావటంతో గుట్టుచప్పుడు కాకుండా మృతుడి కుటుంబ సభ్యులతో రాజీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • రాళ్లు రువ్వుకున్న ఇరు వర్గాలు.. 15 మందికి గాయాలు!
    హన్​మాన్ జయంతి వేడుకల ఊరేగింపులో ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్న ఘటనలో 15 మంది గాయాల పాలయ్యారు. ఈ ఘటన కర్నూలు జిల్లా హోళగుందలో చోటుచేసుకుంది. దీంతో.. పోలీసులు గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • లారీ-బైక్ ఢీ.. చిన్నారి సహా భార్యాభర్తలు మృతి !
    కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. యానాం-ఎదుర్లంక బాలయోగి వారధిపై ద్విచక్రవాహనాన్ని ఇసుక లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు సహా కుమారుడు మృతి చెందాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'భారత్​లో 40లక్షల కరోనా మరణాలు- కేంద్రమే కారణం!'
    కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. కరోనా విజృంభణ సమయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే దేశంలో 40 లక్షల మంది భారతీయులు మరణించారని ఆరోపించారు. ప్రతి బాధిత కుటుంబానికి రూ.4లక్షల పరిహారం అందించాలని కేంద్రాన్ని డిమాండ్​ చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'భాజపాతో కాంగ్రెస్ సీనియర్ల కుమ్మక్కు- మీ పార్టీలో ఇక నేనుండను!'
    కాంగ్రెస్ కీలక నేత రిపున్ బోరా ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను దిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి పంపారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం భాజపాతో కొట్లాడే స్థితిలో లేదని లేఖలో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • అఫ్గాన్​పై పాక్​ వాయుదాడులు.. 40 మంది మృతి
    అఫ్గానిస్థాన్​పై పాకిస్థాన్​ వైమానిక దాడులు జరిపింది. ఈ ఘటనలో 40 మందికిపైగా మృతిచెందారు. పాక్​ వైఖరిని ఖండిస్తున్నట్లు ప్రకటించింది ఆ దేశ ప్రభుత్వం. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • రికార్డ్​ స్థాయికి సీఎన్​జీ ధర.. కేంద్రం ఏమందంటే?
    దేశంలో పెట్రోల్​, డీజిల్​ ధరలతో పాటు సీఎన్​జీ గ్యాస్​ ధరలు భగ్గుమంటున్నాయి. కొద్ది రోజుల్లోనే రికార్డు స్థాయికి చేరుకున్నాయి. డిమాండ్​కు తగినట్లుగా కొత్త కేటాయింపులు లేకపోవటం వల్లే భారం పడుతోందని సిటీ గ్యాస్​ పంపిణీ విభాగాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే.. పెరిగిన డిమాండ్​కు సంబంధించిన కొత్త డేటా అందించలేదని, అప్డేటెడ్​ సమాచారం కోసం వేచి ఉన్నామని కేంద్రం పేర్కొనటం గమనార్హం. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • స్మార్ట్‌ ఫోన్లు వేడెక్కుతున్నాయా? ఈ టిప్స్​ మీ కోసమే..
    వేసవిలో ఫోన్లు హీటెక్కడం పలువురు వినియోగదారుల అనుభవంలోకి వచ్చే ఉంటుంది. ఈ కాలంలో ఎలాంటి జాగ్రత్తలతో స్మార్ట్​ఫోన్​లను సురక్షితంగా ఉంచుకోగలం? బ్యాటరీని కాపాడుకోవడం ఎలా? పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • రెడ్ మిర్చి ఘాటులా రకుల్.. ఆ డ్రెస్​ రూ.55 వేలంట!
    స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. వీకెండ్ వచ్చిందంటే చాలు.. నెట్టింట అందాలను ఆరబోస్తుంది. లేటెస్ట్ ఫొటోలతో అభిమానులకు ఊహించని ట్రీట్స్​ ఇస్తోంది. బాలీవుడ్​లో వరుస చిత్రాల్లో నటిస్తున్న రకుల్.. అక్కడి వాతావరణానికి తగ్గట్టుగానే ఫ్యాషన్​పై దృష్టి పెడుతోంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'భారత్​కు ప్రపంచకప్​ అందించడమే నా లక్ష్యం'
    టీ20 ప్రపంచకప్​- 2022లో భారత్​ను జగజ్జేతగా నిలపటమే తన లక్ష్యమని వెటనర్​ బ్యాటర్​, వికెట్​ కీపర్​ దినేశ్​ కార్తీక్​ పేర్కొన్నాడు. ఐపీఎల్​లో శనివారం రాత్రి దిల్లీపై ఆర్​సీబీ విజయం సాధించటంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్​ అనంతరం విరాట్​ కోహ్లీతో ఇంటర్వ్యూలో పలు విషయాలపై మాట్లాడాడు. మరోవైపు.. దినేశ్​ కార్తీక్​పై ప్రశంసలు కురిపించాడు బెంగళూరు కెప్టెన్​ డూప్లిసెస్​. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.