తెలంగాణలోని సిద్దిపేటను అభివృద్ధి చేసిన మంత్రి హరీశ్రావును ఆదర్శంగా తీసుకొని తన నియోజకవర్గం రూపురేఖలు మారుస్తానని కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్రెడ్డి తెలిపారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం గురించి ఏపీ ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్తానన్నారు.
సిద్దిపేట పట్టణంలో పర్యటించిన ఎమ్మెల్యే శివప్రసాద్రెడ్డి.. పట్టణంలోని నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను పరిశీలించారు. మార్కెట్లో దుకాణదారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లను సందర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రాధ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
సిద్దిపేటలో చాలా అద్భుతంగా అభివృద్ధి జరిగింది. ఇంటిగ్రేటెడ్ మార్కెట్, రైతు బజార్, డబుల్ బెడ్ రూం ఇళ్లు చాలా బాగున్నాయి. ఒక కుటుంబానికి సరిపడా విధంగా నిర్మించారు. ఈ డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం గురించి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్తా. నా నియోజకవర్గంలో 24 వేల ఇళ్లు నిర్మిస్తున్నా.. అందుకే సిద్దిపేటలో డబుల్ బెడ్రూం ఇళ్లు చూసేందుకు వచ్చా. సిద్దిపేట పట్టణం చాలా బాగుంది. నిజం చెప్పాలంటే నా పొద్దుటూరు నియోజకవర్గం ఇంత బాగోలేదు. ఏపీలో ప్రస్తుతం మా ప్రభుత్వం ఉంది. హరీశ్రావును ఆదర్శంగా తీసుకొని.. సిద్దిపేటలా.. ప్రొద్దుటూరును అభివృద్ధి చేస్తా. తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు. - శివప్రసాద్రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే,కడప జిల్లా
ఇవీచూడండి:
'ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులు'