ETV Bharat / city

High Court News: మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై కాసేపట్లో హైకోర్టు తీర్పు

author img

By

Published : Mar 2, 2022, 10:31 PM IST

Updated : Mar 3, 2022, 10:31 AM IST

AP High Court News: మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై కాసేపట్లో హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఇరుపక్షాల వాదనలు వినడం ఇప్పటికే పూర్తి కావటంతో.. సీజే నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్లపై తీర్పు ఇవ్వనుంది.

HC ON CRDA
HC ON CRDA

Hc on CRDA: రాజధాని వ్యవహారంపై దాఖలైన వ్యాజ్యాలన్నింటిలో హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం నేడు తీర్పు ఇవ్వనుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఉదయం 10.30 గంటలకు తీర్పును వెల్లడించనుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) రద్దు చట్టం, పాలన వికేంద్రీకరణ(మూడు రాజధానులు) చట్టాలను సవాలుచేస్తూ రాజధాని రైతులతో పాటు పలువురు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరుగుతుండగానే.. ఆ చట్టాలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం(యాక్ట్‌ 11/2021) తీసుకొచ్చింది.

రాష్ట్రపతి నోటిఫై చేసిన నేపథ్యంలో...

మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేసుకున్నప్పటికీ తాము దాఖలు చేసిన వ్యాజ్యాల్లో కొన్ని అభ్యర్థనలు మిగిలే ఉన్నాయని, వాటిపై విచారణ జరిపి తగిన ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు త్రిసభ్య ధర్మాసనాన్ని కోరారు. రాజధాని అమరావతి బృహత్తర ప్రణాళిక(మాస్టర్‌ ప్లాన్‌)ను అమలు చేసేలా, భూసమీకరణ పథకం కింద భూములిచ్చిన రైతులకు ప్లాట్లు అభివృద్ధి చేసి ఇచ్చేలా చూడాలని... హైకోర్టును అమరావతిలో ఏర్పాటు చేస్తూ రాష్ట్రపతి నోటిఫై చేసిన నేపథ్యంలో దాని విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా నిలువరించాలని, మూడు రాజధానుల నిర్ణయానికి ఆధారమైన కమిటీ నివేదికలను రద్దు చేయాలని, రాజధానిని మార్చే శాసనాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ప్రకటించాలని, హైకోర్టు శాశ్వత భవన నిర్మాణాన్ని కొనసాగించాలని, సీఆర్‌డీఏ చట్టాన్ని సరైన స్ఫూర్తితో అమలు చేసేలా ఆదేశించాలని, రాజధానిలో ఆగిపోయిన పనులను కొనసాగించాలని తదితర అభ్యర్థనతో వాదనలు వినిపించారు. మూడు రాజధానుల చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై దాఖలైన వ్యాజ్యాలన్నీ నిరర్థకం అవుతాయని, వాటిపై విచారణ అవసరం లేదని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఫిబ్రవరి 4న ఈ వ్యాజ్యాలపై ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వు చేస్తున్నట్లు త్రిసభ్య ధర్మాసనం ప్రకటించింది. గురువారం తీర్పు ఇవ్వనుంది.

మొక్కవోని దీక్షతో..

రాజధాని కోసం తరాలుగా ఆస్తిగా వస్తున్న భూముల్ని త్యజించారు. రాష్ట్ర భవిష్యత్‌ దేదీప్యమానంగా ఉండాలని ఆకాంక్షించారు. పిల్లలు కళ్లముందే ఉంటూ ఉపాధి చూసుకుంటారని కలలు కన్నారు. ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయం వారిని అంధకారంలోకి నెట్టేసింది. భవిష్యత్‌ వారికి అగమ్య గోచరంగా తోచింది. త్యాగం వృథా పోతోందన్న ఆలోచన వారిని నిలవనీయకుండా చేసింది. అమరావతి కోసం రోడ్డెక్కారు. రాష్ట్ర భవిష్యత్‌ కోసం పోరుబాట పట్టారు. ఎన్ని రకాలుగా అణగదొక్కాలని చూసినా... వెనక్కి తగ్గలేదు. దెబ్బలు తింటూనే ముందుకు దూసుకెళ్లారు. 807 రోజులుగా మొక్కవోని దీక్షతో... ర్యాలీలు, దీక్షలు, నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. న్యాయం కోసం దేవుడితో మొరపెట్టుకునేందుకు... న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ పాదయాత్ర సాగించారు. అమరావతి సాధన కోసం పట్టు వదలకుండా పోరాడుతూనే ఉన్నారు. న్యాయం కోసం న్యాయపోరాటం చేశారు. ఇవాళ హైకోర్టు తీర్పు వెలువడనుండగా... అమరావతికి సానుకూలంగా నిర్ణయం రావాలని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు..

బంతిని గోడకేసి కొడితే అంతే బలంగా వెనక్కి వస్తుంది. కాలితో... ఎంత గట్టిగా తొక్కిపెడితే అంతకు మించిన ఒత్తిడితో పైకి లేస్తుంది. రాజధాని అమరావతి కోసం రైతులు చేపట్టిన పోరాటమూ అంతే.! నిబంధనలు, లాఠీఛార్జ్‌లు, బెదిరింపులు.. కేసులు.! వేటికీ అదరలేదు! బెదరలేదు! ఒక్క అడుగూ వెనక్కి వేయలేదు! ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 807 రోజులైనా పోరాటం ఆపలేదు. రెట్టించిన ఉత్సాహంతో ఉద్యమం కొనసాగిస్తున్నారు.

భూముల కోసమే పోరాడుతున్నారన్నా..! పెయిడ్ ఆర్టిస్టులంటూ అవమానకరంగా ఎవరెన్ని మాట్లాడినా సహించారు. ఉద్యమాన్ని అడ్డుకోవాలని ఉక్కుపాదం మోపినా లెక్కచేయక ముందుకు సాగారు అమరావతి రైతులు. దేవుడితోనే మొరపెట్టుకోలవాలని... అమరావతి నుంచి తిరుపతికి.... న్యాయస్థానం టూ దేవస్థానం పేరిట యాత్ర చేపట్టి... విజయవంతంగా ముగించారు. పాదయాత్రలోనూ ఎన్ని అడ్డంకులు సృష్టించినా..., ఆంక్షలు పెట్టినా అధిగమించుకుంటూ ముందుకు సాగారు. ఇవాళ న్యాయస్థానం తీర్పు వెలువరించనున్న సందర్భంగా.... నిర్ణయం తమకు అనుకూలంగా వస్తుందని ఆశాభావంతో ఉన్నారు.

ఇదీ చదవండి:

ఏపీ రాజధాని అమరావతేనన్న కేంద్రం.. బడ్జెట్‌లో కేటాయింపులు

Hc on CRDA: రాజధాని వ్యవహారంపై దాఖలైన వ్యాజ్యాలన్నింటిలో హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం నేడు తీర్పు ఇవ్వనుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఉదయం 10.30 గంటలకు తీర్పును వెల్లడించనుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) రద్దు చట్టం, పాలన వికేంద్రీకరణ(మూడు రాజధానులు) చట్టాలను సవాలుచేస్తూ రాజధాని రైతులతో పాటు పలువురు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరుగుతుండగానే.. ఆ చట్టాలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం(యాక్ట్‌ 11/2021) తీసుకొచ్చింది.

రాష్ట్రపతి నోటిఫై చేసిన నేపథ్యంలో...

మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేసుకున్నప్పటికీ తాము దాఖలు చేసిన వ్యాజ్యాల్లో కొన్ని అభ్యర్థనలు మిగిలే ఉన్నాయని, వాటిపై విచారణ జరిపి తగిన ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు త్రిసభ్య ధర్మాసనాన్ని కోరారు. రాజధాని అమరావతి బృహత్తర ప్రణాళిక(మాస్టర్‌ ప్లాన్‌)ను అమలు చేసేలా, భూసమీకరణ పథకం కింద భూములిచ్చిన రైతులకు ప్లాట్లు అభివృద్ధి చేసి ఇచ్చేలా చూడాలని... హైకోర్టును అమరావతిలో ఏర్పాటు చేస్తూ రాష్ట్రపతి నోటిఫై చేసిన నేపథ్యంలో దాని విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా నిలువరించాలని, మూడు రాజధానుల నిర్ణయానికి ఆధారమైన కమిటీ నివేదికలను రద్దు చేయాలని, రాజధానిని మార్చే శాసనాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ప్రకటించాలని, హైకోర్టు శాశ్వత భవన నిర్మాణాన్ని కొనసాగించాలని, సీఆర్‌డీఏ చట్టాన్ని సరైన స్ఫూర్తితో అమలు చేసేలా ఆదేశించాలని, రాజధానిలో ఆగిపోయిన పనులను కొనసాగించాలని తదితర అభ్యర్థనతో వాదనలు వినిపించారు. మూడు రాజధానుల చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై దాఖలైన వ్యాజ్యాలన్నీ నిరర్థకం అవుతాయని, వాటిపై విచారణ అవసరం లేదని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఫిబ్రవరి 4న ఈ వ్యాజ్యాలపై ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వు చేస్తున్నట్లు త్రిసభ్య ధర్మాసనం ప్రకటించింది. గురువారం తీర్పు ఇవ్వనుంది.

మొక్కవోని దీక్షతో..

రాజధాని కోసం తరాలుగా ఆస్తిగా వస్తున్న భూముల్ని త్యజించారు. రాష్ట్ర భవిష్యత్‌ దేదీప్యమానంగా ఉండాలని ఆకాంక్షించారు. పిల్లలు కళ్లముందే ఉంటూ ఉపాధి చూసుకుంటారని కలలు కన్నారు. ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయం వారిని అంధకారంలోకి నెట్టేసింది. భవిష్యత్‌ వారికి అగమ్య గోచరంగా తోచింది. త్యాగం వృథా పోతోందన్న ఆలోచన వారిని నిలవనీయకుండా చేసింది. అమరావతి కోసం రోడ్డెక్కారు. రాష్ట్ర భవిష్యత్‌ కోసం పోరుబాట పట్టారు. ఎన్ని రకాలుగా అణగదొక్కాలని చూసినా... వెనక్కి తగ్గలేదు. దెబ్బలు తింటూనే ముందుకు దూసుకెళ్లారు. 807 రోజులుగా మొక్కవోని దీక్షతో... ర్యాలీలు, దీక్షలు, నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. న్యాయం కోసం దేవుడితో మొరపెట్టుకునేందుకు... న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ పాదయాత్ర సాగించారు. అమరావతి సాధన కోసం పట్టు వదలకుండా పోరాడుతూనే ఉన్నారు. న్యాయం కోసం న్యాయపోరాటం చేశారు. ఇవాళ హైకోర్టు తీర్పు వెలువడనుండగా... అమరావతికి సానుకూలంగా నిర్ణయం రావాలని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు..

బంతిని గోడకేసి కొడితే అంతే బలంగా వెనక్కి వస్తుంది. కాలితో... ఎంత గట్టిగా తొక్కిపెడితే అంతకు మించిన ఒత్తిడితో పైకి లేస్తుంది. రాజధాని అమరావతి కోసం రైతులు చేపట్టిన పోరాటమూ అంతే.! నిబంధనలు, లాఠీఛార్జ్‌లు, బెదిరింపులు.. కేసులు.! వేటికీ అదరలేదు! బెదరలేదు! ఒక్క అడుగూ వెనక్కి వేయలేదు! ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 807 రోజులైనా పోరాటం ఆపలేదు. రెట్టించిన ఉత్సాహంతో ఉద్యమం కొనసాగిస్తున్నారు.

భూముల కోసమే పోరాడుతున్నారన్నా..! పెయిడ్ ఆర్టిస్టులంటూ అవమానకరంగా ఎవరెన్ని మాట్లాడినా సహించారు. ఉద్యమాన్ని అడ్డుకోవాలని ఉక్కుపాదం మోపినా లెక్కచేయక ముందుకు సాగారు అమరావతి రైతులు. దేవుడితోనే మొరపెట్టుకోలవాలని... అమరావతి నుంచి తిరుపతికి.... న్యాయస్థానం టూ దేవస్థానం పేరిట యాత్ర చేపట్టి... విజయవంతంగా ముగించారు. పాదయాత్రలోనూ ఎన్ని అడ్డంకులు సృష్టించినా..., ఆంక్షలు పెట్టినా అధిగమించుకుంటూ ముందుకు సాగారు. ఇవాళ న్యాయస్థానం తీర్పు వెలువరించనున్న సందర్భంగా.... నిర్ణయం తమకు అనుకూలంగా వస్తుందని ఆశాభావంతో ఉన్నారు.

ఇదీ చదవండి:

ఏపీ రాజధాని అమరావతేనన్న కేంద్రం.. బడ్జెట్‌లో కేటాయింపులు

Last Updated : Mar 3, 2022, 10:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.