ETV Bharat / city

నేడు హైకోర్టుకు సీఎస్.. కార్యాలయాలకు రంగులపై వివరణ - ప్రభుత్వ కార్యాలయాల రంగులపై హైకోర్టుకు సీఎస్ సాహ్ని

ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల అంశంపై హైకోర్టు విచారణ చేయనుంది. ఈ విషయంపై సీఎస్ నీలం సాహ్ని, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి ద్వివేది, కమిషనర్ గిరిజాశకంర్ కోర్టుకు హాజరై వివరణ ఇవ్వనున్నారు.

ఏపీ హైకోర్టు
ఏపీ హైకోర్టు
author img

By

Published : May 28, 2020, 10:05 AM IST

ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల అంశంపై గురువారం హైకోర్టులో విచారణ జరగనుంది. విచారణలో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి‌ నీలం సాహ్ని కోర్టుకు హాజరకానున్నారు. పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి జి.కె.ద్వివేది, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్.. సీఎస్ వెంట వెళ్లనున్నారు.

జీవో నెం. 623 జారీని కోర్టు ధిక్కరణ కింద ఎందుకు పరిగణించకూడదో వివరణ ఇవ్వాలని అధికారులను కోర్టు గత విచారణలో ఆదేశించింది. సీఎస్ నేరుగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. జీవో జారీపై కోర్టు ధిక్కరణ ప్రోసీడింగ్స్‌ను ప్రారంభించాలని హైకోర్టు రిజిస్ట్రార్​కు ఆదేశాలిచ్చింది.

ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల అంశంపై గురువారం హైకోర్టులో విచారణ జరగనుంది. విచారణలో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి‌ నీలం సాహ్ని కోర్టుకు హాజరకానున్నారు. పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి జి.కె.ద్వివేది, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్.. సీఎస్ వెంట వెళ్లనున్నారు.

జీవో నెం. 623 జారీని కోర్టు ధిక్కరణ కింద ఎందుకు పరిగణించకూడదో వివరణ ఇవ్వాలని అధికారులను కోర్టు గత విచారణలో ఆదేశించింది. సీఎస్ నేరుగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. జీవో జారీపై కోర్టు ధిక్కరణ ప్రోసీడింగ్స్‌ను ప్రారంభించాలని హైకోర్టు రిజిస్ట్రార్​కు ఆదేశాలిచ్చింది.

ఇదీ చదవండి:

అమరావతితో మహానాడు అనుబంధం.. బెజవాడలో చారిత్రక ఘట్టం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.