ETV Bharat / city

కీలక నిర్ణయాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర

author img

By

Published : Dec 18, 2020, 1:40 PM IST

Updated : Dec 18, 2020, 3:29 PM IST

రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. పౌరసరఫరాల కార్పొరేషన్ ద్వారా 5 వేల కోట్ల రూపాయల రుణ సమీకరణ, ప్రతి నియోజకవర్గంలో పశువుల రోగ నిర్ధరణ కేంద్రాల ఏర్పాటు వంటి నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది.

CM jagan
CM jagan

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన సచివాలయంలోని మొదటి బ్లాక్​లో శుక్రవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పౌరసరఫరాల కార్పొరేషన్ ద్వారా ఐదు వేల కోట్ల రూపాయల రుణ సమీకరణకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. అలాగే రాష్ట్రంలో నూతన పర్యాటక విధానానికి పచ్చజెండా ఊపింది.

మంత్రివర్గం ఆమోదించిన మరికొన్ని అంశాలు

  • రాష్ట్రంలో వైద్య విద్య & పరిశోధన కార్పొరేషన్ ఏర్పాటు
  • సర్వే, బౌండరీ చట్ట సవరణ
  • తిరుపతిలో ల్యాండ్ సర్వే అకాడమీ ఏర్పాటు, దీనికి 40 ఎకరాల భూ కేటాయింపు
  • ఏపీ డైరీ డెవలప్​మెంట్ కార్పొరేషన్​లో ఉద్యోగులకు వీఆర్ఎస్
  • ప్రతి నియోజకవర్గంలో పశువుల రోగ నిర్ధరణ కేంద్రాల ఏర్పాటు

సీఎస్​కు సత్కారం

మరోవైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఈ నెలాఖరుకి పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో మంత్రి మండలి సీఎస్​ను సత్కరించింది.

ap-cabinet-approved-several-key-decisions
సీఎస్​కు సత్కారం

ఇదీ చదవండి

అమరావతి ఉద్యమంపై తొలిసారి స్పందించిన సీఎం జగన్​

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన సచివాలయంలోని మొదటి బ్లాక్​లో శుక్రవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పౌరసరఫరాల కార్పొరేషన్ ద్వారా ఐదు వేల కోట్ల రూపాయల రుణ సమీకరణకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. అలాగే రాష్ట్రంలో నూతన పర్యాటక విధానానికి పచ్చజెండా ఊపింది.

మంత్రివర్గం ఆమోదించిన మరికొన్ని అంశాలు

  • రాష్ట్రంలో వైద్య విద్య & పరిశోధన కార్పొరేషన్ ఏర్పాటు
  • సర్వే, బౌండరీ చట్ట సవరణ
  • తిరుపతిలో ల్యాండ్ సర్వే అకాడమీ ఏర్పాటు, దీనికి 40 ఎకరాల భూ కేటాయింపు
  • ఏపీ డైరీ డెవలప్​మెంట్ కార్పొరేషన్​లో ఉద్యోగులకు వీఆర్ఎస్
  • ప్రతి నియోజకవర్గంలో పశువుల రోగ నిర్ధరణ కేంద్రాల ఏర్పాటు

సీఎస్​కు సత్కారం

మరోవైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఈ నెలాఖరుకి పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో మంత్రి మండలి సీఎస్​ను సత్కరించింది.

ap-cabinet-approved-several-key-decisions
సీఎస్​కు సత్కారం

ఇదీ చదవండి

అమరావతి ఉద్యమంపై తొలిసారి స్పందించిన సీఎం జగన్​

Last Updated : Dec 18, 2020, 3:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.