ETV Bharat / city

అసెంబ్లీలో జై అమరావతి నినాదాలు.. నేతల మధ్య వాగ్వాదం

శాసనసభలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. తెదేపా నేతల తీరును మంత్రులు తప్పుబట్టారు.

author img

By

Published : Jan 22, 2020, 12:19 PM IST

ap assembly
ap assembly
అసెంబ్లీలో జై అమరావతి నినాదాలు - నేతల మధ్య మాటల యుద్ధం

శాసనసభలో వైకాపా, తెదేపా మధ్య మాటల యుద్ధం కొనసాగింది. మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే తెదేపా సభ్యులు ‘జై అమరావతి' అంటూ నినాదాలు చేశారు. స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. తెదేపా సభ్యులు ఆందోళన చేస్తుండగానే ..మంత్రులు తమ ప్రసంగం కొనసాగించారు. మంత్రి కన్నబాబు మాట్లాడుతూ... అమ్మ ఒడి, రైతు భరోసా లాంటి కీలక అంశాలపై సభలో చర్చ జరుగుతున్నప్పుడు తెదేపా సభ్యులు గందరగోళం చేయడం తగదన్నారు. విశాఖకు రాజధాని వస్తుంటే ఉత్తరాంధ్ర తెదేపా ఎమ్మెల్యేలు అడ్డుకోవడం దారుణమని విమర్శించారు.

.

అసెంబ్లీలో జై అమరావతి నినాదాలు - నేతల మధ్య మాటల యుద్ధం

శాసనసభలో వైకాపా, తెదేపా మధ్య మాటల యుద్ధం కొనసాగింది. మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే తెదేపా సభ్యులు ‘జై అమరావతి' అంటూ నినాదాలు చేశారు. స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. తెదేపా సభ్యులు ఆందోళన చేస్తుండగానే ..మంత్రులు తమ ప్రసంగం కొనసాగించారు. మంత్రి కన్నబాబు మాట్లాడుతూ... అమ్మ ఒడి, రైతు భరోసా లాంటి కీలక అంశాలపై సభలో చర్చ జరుగుతున్నప్పుడు తెదేపా సభ్యులు గందరగోళం చేయడం తగదన్నారు. విశాఖకు రాజధాని వస్తుంటే ఉత్తరాంధ్ర తెదేపా ఎమ్మెల్యేలు అడ్డుకోవడం దారుణమని విమర్శించారు.

.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.