ETV Bharat / city

వారి వల్లే 300 మందికి కరోనా..తేల్చిన ప్రభుత్వం

రాష్ట్రంలో సుమారు 40 మంది నుంచి కరోనా వ్యాప్తి ఎక్కువగా జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. వీరివల్ల 300మందికి పైగా వైరస్ బారిన పడినట్లు తేల్చింది. వీరిని వైద్యారోగ్య శాఖ 'సూపర్ స్పైడర్'​గా పేర్కొంటోంది.

author img

By

Published : May 11, 2020, 7:09 AM IST

super spyders
super spyders

రాష్ట్రంలో సుమారు 40 మంది నుంచి కరోనా వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా జరిగింది. వీరివల్ల సుమారు 300 మందికిపైగా వైరస్‌ సోకినట్లు ప్రభుత్వం తేల్చింది. ఈ 40 మంది నుంచి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌ వివరాలు సేకరించి గుర్తించారు. వీరిని వైద్య ఆరోగ్య శాఖ ‘సూపర్‌ స్ప్రెడర్‌’గా పేర్కొంటోంది.

ఈ నెల 5వ తేదీ వరకు సేకరించిన సమాచారం ప్రకారం...
* కర్నూలు జిల్లాలో ఓ వ్యక్తి నుంచి ఏకంగా 32 మందికి వైరస్‌ సోకింది. ఒకరి ద్వారా ఇంతమందికి వైరస్‌ సోకడం రాష్ట్రంలో ఇదే ప్రథమం.
* కృష్ణా జిల్లాలో ఒకరి నుంచి 18 మందికి కరోనా వచ్చింది.
* గుంటూరు జిల్లాలో ఓ వ్యక్తి ద్వారా 17 మందికి వైరస్‌ సోకింది. ఈ జిల్లాలోనే పలువురిలో ఒక్కొక్కరు 15 నుంచి ఐదుగురు వంతున వైరస్‌ బారిన పడేందుకు కారణమయ్యారు.
* అనంతపురం, తూర్పు గోదావరి జిల్లాలోనూ ఒక్కొక్క వ్యక్తి నుంచి 12 మందికి వైరస్‌ సోకింది.
* ప్రకాశం జిల్లాలో ఇద్దరు వ్యక్తుల నుంచి పది మందికి వైరస్‌ వచ్చినట్లు తేలింది. ఇటువంటి సంఘటనలే మరికొన్ని ఇతర జిల్లాల్లో చోటుచేసుకున్నాయి.

80శాతం మందిలో లక్షణాలు లేవు
ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌లో 80శాతం మందిలో వైరస్‌ అనుమానిత లక్షణాలు కనిపించలేదని కొవిడ్‌-19 ప్రత్యేక అధికారి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఈ వివరాలను ఇటీవల కేంద్ర బృందానికి ఆయన వివరించారు.

రాష్ట్రంలో సుమారు 40 మంది నుంచి కరోనా వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా జరిగింది. వీరివల్ల సుమారు 300 మందికిపైగా వైరస్‌ సోకినట్లు ప్రభుత్వం తేల్చింది. ఈ 40 మంది నుంచి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌ వివరాలు సేకరించి గుర్తించారు. వీరిని వైద్య ఆరోగ్య శాఖ ‘సూపర్‌ స్ప్రెడర్‌’గా పేర్కొంటోంది.

ఈ నెల 5వ తేదీ వరకు సేకరించిన సమాచారం ప్రకారం...
* కర్నూలు జిల్లాలో ఓ వ్యక్తి నుంచి ఏకంగా 32 మందికి వైరస్‌ సోకింది. ఒకరి ద్వారా ఇంతమందికి వైరస్‌ సోకడం రాష్ట్రంలో ఇదే ప్రథమం.
* కృష్ణా జిల్లాలో ఒకరి నుంచి 18 మందికి కరోనా వచ్చింది.
* గుంటూరు జిల్లాలో ఓ వ్యక్తి ద్వారా 17 మందికి వైరస్‌ సోకింది. ఈ జిల్లాలోనే పలువురిలో ఒక్కొక్కరు 15 నుంచి ఐదుగురు వంతున వైరస్‌ బారిన పడేందుకు కారణమయ్యారు.
* అనంతపురం, తూర్పు గోదావరి జిల్లాలోనూ ఒక్కొక్క వ్యక్తి నుంచి 12 మందికి వైరస్‌ సోకింది.
* ప్రకాశం జిల్లాలో ఇద్దరు వ్యక్తుల నుంచి పది మందికి వైరస్‌ వచ్చినట్లు తేలింది. ఇటువంటి సంఘటనలే మరికొన్ని ఇతర జిల్లాల్లో చోటుచేసుకున్నాయి.

80శాతం మందిలో లక్షణాలు లేవు
ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌లో 80శాతం మందిలో వైరస్‌ అనుమానిత లక్షణాలు కనిపించలేదని కొవిడ్‌-19 ప్రత్యేక అధికారి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఈ వివరాలను ఇటీవల కేంద్ర బృందానికి ఆయన వివరించారు.

ఇదీ చదవండి:

ఆపరేషన్​ కరోనా: ముఖ్యమంత్రులతో నేడు ప్రధాని భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.