ETV Bharat / city

ఆర్జీయూకేటీ ప్రవేశాలపై సందిగ్ధం - ambiguty on iiit admissions

ఈ ఏడాది ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలపై సందిగ్ధత నెలకొంది. కరోనా వల్ల పదో తరగతి పరీక్షలు రద్దు చేసినందున ప్రవేశాలు ఎలా చేపట్టాలన్న దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఆర్జీయూకేటీ ప్రవేశాలపై సందిగ్ధం
ఆర్జీయూకేటీ ప్రవేశాలపై సందిగ్ధం
author img

By

Published : Jul 11, 2020, 8:12 AM IST

రాజీవ్​గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలపై సందిగ్ధం నెలకొంది. పదో తరగతిలో విద్యార్థుల గ్రేడు, రిజర్వేషన్ల ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి. కరోనా కారణంగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రద్దు చేశారు. అందువల్ల ప్రవేశాలకు పరీక్ష నిర్వహిస్తారా..? లేక 9వ తరగతి పరీక్షా ఫలితాల ఆధారంగా గ్రేడ్​ పాయింట్లు ఇస్తారా..? మరేదైనా మార్గం అనుసరిస్తారా..? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

సెప్టెంబరులో ఇంజినీరింగ్​ పరీక్షలు

ట్రిపుల్​ఐటీల్లో తొలుత ఇంజినీరింగ్​ ఆఖరి సంవత్సరం, తర్వాత పీయూసీ-2 విద్యార్థులకు తుది పరీక్షలు నిర్వహించనున్నట్లు నూజివీడు ట్రిపుల్​ఐటీ ఇన్​ఛార్జి డైరెక్టర్​ ఆచార్య ఎస్​ఎస్​ఎస్​వీ గోపాలరాజు తెలిపారు. యూజీసీ ఆదేశాల మేరకు సెప్టెంబరు లోపు పరీక్షలు నిర్వహించాల్సి ఉందన్నారు. ఆన్​లైన్​లోనా.. లేక మామూలుగా నిర్వహించాలా..? అనే దానిపై స్పష్టత రాలేదని చెప్పారు. పీయూసీ - 1, ఈ-1, ఈ-2, ఈ-3 విద్యార్థులకు ఆన్​లైన్​ తరగతులు నిర్వహించనున్నమని పేర్కొన్నారు.

ఇదీ చూడండి..

'గోదావరి బోర్డును తప్పుదోవ పట్టిస్తున్నారు'

రాజీవ్​గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలపై సందిగ్ధం నెలకొంది. పదో తరగతిలో విద్యార్థుల గ్రేడు, రిజర్వేషన్ల ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి. కరోనా కారణంగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రద్దు చేశారు. అందువల్ల ప్రవేశాలకు పరీక్ష నిర్వహిస్తారా..? లేక 9వ తరగతి పరీక్షా ఫలితాల ఆధారంగా గ్రేడ్​ పాయింట్లు ఇస్తారా..? మరేదైనా మార్గం అనుసరిస్తారా..? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

సెప్టెంబరులో ఇంజినీరింగ్​ పరీక్షలు

ట్రిపుల్​ఐటీల్లో తొలుత ఇంజినీరింగ్​ ఆఖరి సంవత్సరం, తర్వాత పీయూసీ-2 విద్యార్థులకు తుది పరీక్షలు నిర్వహించనున్నట్లు నూజివీడు ట్రిపుల్​ఐటీ ఇన్​ఛార్జి డైరెక్టర్​ ఆచార్య ఎస్​ఎస్​ఎస్​వీ గోపాలరాజు తెలిపారు. యూజీసీ ఆదేశాల మేరకు సెప్టెంబరు లోపు పరీక్షలు నిర్వహించాల్సి ఉందన్నారు. ఆన్​లైన్​లోనా.. లేక మామూలుగా నిర్వహించాలా..? అనే దానిపై స్పష్టత రాలేదని చెప్పారు. పీయూసీ - 1, ఈ-1, ఈ-2, ఈ-3 విద్యార్థులకు ఆన్​లైన్​ తరగతులు నిర్వహించనున్నమని పేర్కొన్నారు.

ఇదీ చూడండి..

'గోదావరి బోర్డును తప్పుదోవ పట్టిస్తున్నారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.