ETV Bharat / city

అమరావతి రైతుల బెయిల్ పిటిషన్​పై విచారణ 5కి వాయిదా

author img

By

Published : Nov 2, 2020, 8:23 PM IST

గుంటూరు జిల్లా అమరావతి రైతుల బెయిల్ పిటిషన్​పై ఇవాళ జిల్లా న్యాయస్థానంలో విచారణ జరిగింది. వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఈనెల 5కి వాయిదా వేసింది.

అమరావతి రైతుల బెయిల్ పిటిషన్​పై విచారణ
అమరావతి రైతుల బెయిల్ పిటిషన్​పై విచారణ

గుంటూరు జిల్లా అమరావతి రైతుల బెయిల్ పిటిషన్​పై ఇవాళ విచారణ జరిగింది. ఇరువర్గాల వాదనలు విన్న జిల్లా న్యాయస్థానం...తీర్పుని ఈనెల 5వ తేదికి వాయిదా వేసింది. మూడు రాజధానులకు మద్దతుగా ఆందోళనకు వెళ్తున్న వారిని అడ్డుకున్న కేసులో 11మందిపై ఎస్సీ వేధింపుల చట్టం క్రింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇందులో ఏడుగురు అరెస్టయి...ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలులో ఉన్నారు. బెయిల్ కోసం వారు పెట్టుకున్న అభ్యర్థన ఇవాళ జిల్లా కోర్టు ముందుకు రాగా.. నిర్ణయాన్ని 5వ తేదీకి వాయిదా వేశారు.

ఇదీచదవండి

గుంటూరు జిల్లా అమరావతి రైతుల బెయిల్ పిటిషన్​పై ఇవాళ విచారణ జరిగింది. ఇరువర్గాల వాదనలు విన్న జిల్లా న్యాయస్థానం...తీర్పుని ఈనెల 5వ తేదికి వాయిదా వేసింది. మూడు రాజధానులకు మద్దతుగా ఆందోళనకు వెళ్తున్న వారిని అడ్డుకున్న కేసులో 11మందిపై ఎస్సీ వేధింపుల చట్టం క్రింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇందులో ఏడుగురు అరెస్టయి...ప్రస్తుతం గుంటూరు జిల్లా జైలులో ఉన్నారు. బెయిల్ కోసం వారు పెట్టుకున్న అభ్యర్థన ఇవాళ జిల్లా కోర్టు ముందుకు రాగా.. నిర్ణయాన్ని 5వ తేదీకి వాయిదా వేశారు.

ఇదీచదవండి

తిరుమలలో సర్వదర్శనం టికెట్ల కోసం తోపులాట.. భక్తులకు గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.