ఈ జలాశయం నుంచి 94, 340 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు నీటి విడుదలను పెంచనున్నట్లు తెలిపారు. జలాశయం నీటి మట్టం 517.96 మీటర్లు (పూర్తిస్థాయి 519.60)గా నమోదైంది. శుక్రవారం రాత్రి ఏడు గంటలకు నారాయణపుర జలాశయం నుంచి 1,79,060 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.
తుంగభద్రకు లక్ష క్యూసెక్కులు..
హొసపేటె, న్యూస్టుడే: తుంగభద్రకు వరద పోటెత్తింది. శుక్రవారం రాత్రి 7 గంటలకు సుమారు లక్ష క్యూసెక్కుల నీరు చేరుతోంది. జలాశయంలో ఒకేరోజు సుమారు 6 టీఎంసీల నీటి నిల్వలు పెరిగాయి.
848 అడుగులకు శ్రీశైలం నీటిమట్టం
సున్నిపెంట సర్కిల్, న్యూస్టుడే: శ్రీశైలం జలాశయం నీటిమట్టం శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయానికి 848.20 అడుగులుగా నమోదైంది.నీటి నిల్వ సామర్థ్యం 76.14 టీఎంసీలుగా ఉంది. ఎగువ ప్రాంతాలైన జూరాల ప్రాజెక్టు నుంచి 28,049 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 117 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి వస్తోంది. శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్తు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 38,166 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగకు విడుదల చేస్తున్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రీయ స్వచ్ఛ్ కేంద్రాన్ని ప్రారంభించనున్న ప్రధాని