- 'వసతులు పెంచితే ఆరోగ్యశ్రీ అమలైనట్లే'
రాష్ట్రంలో కొవిడ్ బాధితుల కోసం ఆసుపత్రుల్లో వసతులు పెంచితే ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసినట్లేనని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. అంతేకానీ కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చితే ఉపయోగం లేదన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'జగన్ రాజీనామా చేయాలి'
హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంశంపై ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి స్పందించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటని విమర్శించారు. నైతిక విలువలు ఉంటే సీఎం జగన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'అనారోగ్యంగా ఉన్న ఆవులను స్వీకరించొద్దు'
మంత్రి అవంతి శ్రీనివాస్ విశాఖ సింహాద్రి అప్పన్న గోశాలను పరిశీలించారు. భక్తులు కేవలం ఆరోగ్యంగా ఉన్న గోవులను మాత్రమే స్వామికి సమర్పించాలని కోరారు. అనారోగ్యంగా ఉన్న ఆవులను స్వీకరించొద్దని దేవస్థానానికి సూచించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- రికార్డు స్థాయిలో పెరుగుదల
రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. 24 గంటల వ్యవధిలో 2602 మందికి కరోనా పాజిటివ్ సోకినట్టు వైద్యారోగ్యశాఖ తెలియచేసింది. ఇందులో ఏపీకి చెందిన 2592 మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 8 మంది, ఇతర దేశాల నుంచి వచ్చిన ఇద్దరు ఉన్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- చైనా కొత్త కుట్ర !
భారత్తో శాంతి చర్చల్లో చైనా మొండి వైఖరి ప్రదర్శిస్తోందా? బలగాల ఉపసంహరణ విషయంలో ఏకపక్ష ధోరణి అవలంబిస్తోందా? భారత్ ఎంత వారించినా.. ఫింగర్ 5 ప్రాంతం నుంచి వెనక్కి వెళ్లేందుకు నిరాకరిస్తుందా? ఔననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- సోమవారానికి వాయిదా
తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సచిన్ పైలట్ సహా 18 మంది కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యేలకు నాలుగు రోజుల ఉపశమనం లభించింది. పైలట్ వర్గం దాఖలు చేసిన పిటిషన్ విచారణను రాజస్థాన్ హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'సమయం ఆసన్నమైంది'
చైనా వల్లే కరోనా వైరస్ ప్రపంచానికి పాకిందని మరోసారి విమర్శలు చేశారు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో. ఆసియా, ఐరోపా ఖండాల్లోని దేశాలు షీ జిన్పింగ్ పార్టీ నుంచి పొంచి ఉన్న ముప్పును అర్థం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఆ 2 నెలల్లో విపరీతంగా ..
ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ మధ్య కరెన్సీ చలామణి పెరిగినట్లు ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. మార్చి, ఏప్రిల్లో హిందూ పండుగలకు తోడు రబీ పంటల కోత సమయం ఇందుకు కారణంగా పేర్కొంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- శుభాకాంక్షలు తెలిపిన రోహిత్
లా లిగా విజేతగా నిలిచిన రియల్ మాడ్రిడ్ జట్టుకు శుభాకాంక్షలు తెలిపాడు టీమ్ఇండియా క్రికెటర్ రోహిత్ శర్మ. ప్రస్తుతం భారత్లో ఈ లీగ్కు ప్రచార కర్తగా ఉన్నాడు హిట్మ్యాన్. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- కవ్విస్తోన్న శిల్పా శెట్టి
ప్రపంచ ఇమోజీ దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ నటి శిల్పా శెట్టి ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇందులో అనేక రకాల ఇమోజీ ఎక్స్ప్రెషన్స్ను ప్రదర్శిస్తూ.. అభిమానులను అలరించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.