- మాజీమంత్రి అచ్చెన్నాయుడికి బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
మాజీమంత్రి అచ్చెన్నాయుడికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.2 లక్షలు పూచీకత్తుతో దేశం విడిచి వెళ్లరాదని నిబంధనతో బెయిల్ ఇచ్చింది. ఈఎస్ఐలో స్కామ్ జరిగిందని తెదేపా ఎమ్మెల్యే అచ్చెన్న అరెస్టయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సీఎం చేతుల మీదుగా వేదాద్రి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన
వైఎస్ఆర్ వేదాద్రి ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేశారు. రూ.68 కోట్ల అంచనా వ్యయంతో ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తుళ్లూరులో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి తగిలిన రైతుల నిరసన సెగ
తుళ్లూరులో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి నిరసన సెగ తగిలింది. ఎమ్మెల్యే శ్రీదేవి వైకాపా కార్యాలయాన్ని ప్రారంభించారు. తుళ్లూరు రైతులు నల్లజెండాలతో నిరసన తెలిపారు. దీక్షా శిబిరం వద్ద మహిళలు రహదారిపైకి రాకుండాపోలీసులు అడ్డుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'మహా'లో ఘోర ప్రమాదం- నలుగురు మృతి
మహారాష్ట్ర పుణెలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు ట్రక్కులు ఢీకొని నలుగురు మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'జన్ధన్ యోజన'కు ఆరేళ్లు- మోదీ ప్రశంసలు
ప్రధానమంత్రి జన్ధన్ యోజన ద్వారా కోట్లాది మంది గ్రామీణ ప్రజలకు లబ్ధి చేకూరిందని చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. పథకం ప్రారంభించి ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా ట్వీట్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పరీక్షల నిర్వహణపై యూజీసీని సమర్థించిన సుప్రీం
కళాశాలలు, వర్సటీల చివరి సంవతర్సం పరీక్షల నిర్వహణపై తీర్పు వెలువరించింది సుప్రీం కోర్టు. సెప్టెంబర్ 30 లోపు పరీక్షలు నిర్వహించకుండా రాష్ట్రాలు, వర్సటీలు విద్యార్థులను ప్రమోట్ చేయొద్దని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బిహార్ ఎన్నికల వాయిదాపై పిటిషన్ కొట్టివేత
కరోనా, వరదల ప్రభావం తగ్గేవరకు బిహార్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలనే పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సీఈసీ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అమెరికా చెప్పినట్టు చేయొద్దు: డబ్ల్యూహెచ్ఓ
కరోనా పరీక్షల విషయంలో అమెరికాతో ప్రపంచ ఆరోగ్య సంస్థ విభేదించింది. లక్షణాలు లేని వారికి పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదన్న అమెరికా సీడీసీ వాదనను కొట్టిపారేసింది. వైరస్ సోకినట్లు నిర్ధరణ అయిన వ్యక్తికి ఆరడుగుల దూరంలో 15 నిమిషాల పాటు గడిపిన వారందరికీ పరీక్షలు నిర్వహించాలని ప్రపంచ దేశాలకు సూచించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కిమ్ కోమాలో లేరు.. ఇదిగో సాక్ష్యం
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కోమాలో ఉన్నారని కొద్ది రోజులుగా వదంతులు వ్యాపిస్తున్న తురుణంలో ఆయన మళ్లీ ప్రత్యక్షమయ్యారు. టైఫూన్ బవి తుపాను కారణంగా పంటనష్టం జరిగిన ప్రాంతాలను సందర్శించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆ దేశ మీడియా విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సిక్స్ కొట్టి సొంత కారు అద్దం పగలగొట్టుకున్నాడు!
ఐర్లాండ్ క్రికెటర్ కెవిన్ ఓబ్రియాన్ ఇటీవలే ఓ మ్యాచ్లో ఎనిమిది సిక్సర్లు కొట్టాడు. అయితే, అందులో ఒక సిక్స్ వల్ల పార్కింగ్లో ఉంచిన తన కారు అద్దం పగిలిపోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- డిసెంబరులో సెట్స్ పైకి కంగన 'తేజస్'
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ నటిస్తున్న చిత్రం 'తేజస్'. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్లో ప్రారంభం కానున్నట్లు కంగన ట్విట్టర్లో తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.