కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్..రెండు రోజుల విశాఖ పర్యటనలో కీలక కార్యక్రమాలకు హాజరయ్యారు. యుద్ధనౌకలు, జలాంతర్గాములను సందర్శించారు. అనంతరం నౌకదళ అధికారులు, సివిల్ ఉద్యోగులతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. భారతదేశపు యాక్ట్ ఈస్ట్ పాలసీ అమలులో నేవీ కీలక పాత్ర పోషిస్తుందని రాజ్నాథ్ అభిప్రాయపడ్డారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా..ఎదుర్కుకునేందుకు సిద్ధంగా ఉండాలని నావికులకు పిలుపునిచ్చారు.
ఇవీ చదవండి..బలపడనున్న అల్పపీడనం.. 24 గంటల్లో వర్షాలు!