ETV Bharat / city

వరద ప్రాంతాల్లో నిత్యావసరాలు, ఉచిత రేషన్‌: జగన్​

author img

By

Published : Oct 19, 2020, 4:21 PM IST

Updated : Oct 19, 2020, 8:56 PM IST

cm-jagan-
cm-jagan-

16:20 October 19

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే

రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేపట్టారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని నందిగామ, అవనిగడ్డ, పెనమలూరు, మైలవరం, తాడికొండ నియోజకవర్గాల్లో సీఎం సర్వే నిర్వహించారు. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను వీహంగ వీక్షణం ద్వారా మంత్రులు సుచరిత, కొడాలి నాని, సీఎస్​ నీలం సాహ్నితో కలిసి పరిశీలించారు. ముంపు ప్రాంతాలు, దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.  

పంట నష్టంపై అంచనాలు పూర్తి చేయండి.. 
ఏరియల్ సర్వే అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించిన జగన్...పంట నష్టంపై వెంటనే అంచనాలు పూర్తి చేయాలన్నారు. వీలైనంత త్వరగా రైతులకు ఇన్​పుట్​ సబ్సిడీ ఇవ్వాలని ఆదేశించారు. సకాలంలో ఇన్​పుట్ సబ్బిడీ ఇస్తే రబీలో పంట పెట్టుబడికి ఉపయోగపడుతుందన్నారు. పంటలు, ఇళ్లు, పశువులు నష్టపోయిన వారికి వెంటనే పరిహారం ఇవ్వాలన్నారు.  

రూ. 4,450 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా.. 
వర్షాల కారణంగా రాష్ట్రంలో 71 వేల 800 హెక్టార్లలోని పంట నష్టపోయినట్లు ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. విద్యుత్, రహదారుల వ్యవస్థలు ధ్వంసమైనట్లు తేల్చారు. దాదాపు రూ.4,450 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తూ...ఆదుకోవాలని ముఖ్యమంత్రి జగన్ కేంద్రానికి ఇప్పటికే లేఖ రాశారు. తక్షణ సాయంగా వెయ్యి కోట్లు మంజూరు చేయాలని హోంశాఖను కోరిన విషయం తెలిసిందే.  

వరద ప్రభావిత ప్రాంతాల్లోని కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కిలో కందిపప్పు, లీటరు పామాయిల్, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళదుంపలను ఉచితంగా సరఫరా చేయాల్సిందిగా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. 

ఇదీచదవండి

వరద బాధితులను పరామర్శించినందుకే నాపై విమర్శలు: లోకేశ్‌

16:20 October 19

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే

రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేపట్టారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని నందిగామ, అవనిగడ్డ, పెనమలూరు, మైలవరం, తాడికొండ నియోజకవర్గాల్లో సీఎం సర్వే నిర్వహించారు. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను వీహంగ వీక్షణం ద్వారా మంత్రులు సుచరిత, కొడాలి నాని, సీఎస్​ నీలం సాహ్నితో కలిసి పరిశీలించారు. ముంపు ప్రాంతాలు, దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.  

పంట నష్టంపై అంచనాలు పూర్తి చేయండి.. 
ఏరియల్ సర్వే అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించిన జగన్...పంట నష్టంపై వెంటనే అంచనాలు పూర్తి చేయాలన్నారు. వీలైనంత త్వరగా రైతులకు ఇన్​పుట్​ సబ్సిడీ ఇవ్వాలని ఆదేశించారు. సకాలంలో ఇన్​పుట్ సబ్బిడీ ఇస్తే రబీలో పంట పెట్టుబడికి ఉపయోగపడుతుందన్నారు. పంటలు, ఇళ్లు, పశువులు నష్టపోయిన వారికి వెంటనే పరిహారం ఇవ్వాలన్నారు.  

రూ. 4,450 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా.. 
వర్షాల కారణంగా రాష్ట్రంలో 71 వేల 800 హెక్టార్లలోని పంట నష్టపోయినట్లు ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. విద్యుత్, రహదారుల వ్యవస్థలు ధ్వంసమైనట్లు తేల్చారు. దాదాపు రూ.4,450 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తూ...ఆదుకోవాలని ముఖ్యమంత్రి జగన్ కేంద్రానికి ఇప్పటికే లేఖ రాశారు. తక్షణ సాయంగా వెయ్యి కోట్లు మంజూరు చేయాలని హోంశాఖను కోరిన విషయం తెలిసిందే.  

వరద ప్రభావిత ప్రాంతాల్లోని కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కిలో కందిపప్పు, లీటరు పామాయిల్, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళదుంపలను ఉచితంగా సరఫరా చేయాల్సిందిగా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. 

ఇదీచదవండి

వరద బాధితులను పరామర్శించినందుకే నాపై విమర్శలు: లోకేశ్‌

Last Updated : Oct 19, 2020, 8:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.