AP Brothers in Suicide Varanasi : ఏపీకి చెందిన ఇద్దరు యువకులు ఉత్తరప్రదేశ్లో ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. పశ్చిమగోదావరి జిల్లా నారాయణపురానికి చెందిన అన్నదమ్ములు లక్ష్మీనారాయణ, వినోద్ ఆగస్టు 28న వారణాసికి చేరుకున్నారు. ఆ తర్వాత భేలుపూర్లోని రామ్తారక్ ఆంధ్రా ఆశ్రమంలో గదిని అద్దెకు తీసుకున్నారు. రెండురోజులుగా ఆ గదిలో నుంచి దుర్వాసన రావడాన్ని సిబ్బంది గమనించారు.
దీంతో సిబ్బంది తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా ఇద్దరు విగత జీవులుగా పడి ఉన్నారు. దీనిపై వారు పోలీసులుకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వీరు 2 రోజుల క్రితమే బలవన్మరణానికి పాల్పడ్డారని అంచనా వేస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.