ETV Bharat / snippets

నిజామాబాద్​లో కారు బీభత్సం - ఇద్దరు మహిళల మృతి, మరో ఇద్దరికి గాయాలు

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 14, 2024, 5:19 PM IST

Two Women Killed in Nizamabad Road Accident
Two Women Killed in Nizamabad Road Accident (ETV Bharat)

Two Women Killed in Nizamabad Road Accident : నిజామాబాద్​ మాక్లూర్​ మండలంలోని మహాత్మా జ్యోతిబాఫులే పాఠశాల వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరికి తీవ్ర గాయలయ్యాయి. సెలవు దినం కావడంతో పాఠశాల దగ్గరకు తల్లిదండ్రులు వచ్చారు. పాఠశాల ముందు బాలికలతో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో అటువైపుగా వచ్చిన కారు వారిపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మహిళలు మరణించగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్​ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందంటూ స్థానికులు అతన్ని పట్టుకుని చితకబాదారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Two Women Killed in Nizamabad Road Accident : నిజామాబాద్​ మాక్లూర్​ మండలంలోని మహాత్మా జ్యోతిబాఫులే పాఠశాల వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరికి తీవ్ర గాయలయ్యాయి. సెలవు దినం కావడంతో పాఠశాల దగ్గరకు తల్లిదండ్రులు వచ్చారు. పాఠశాల ముందు బాలికలతో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో అటువైపుగా వచ్చిన కారు వారిపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మహిళలు మరణించగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్​ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందంటూ స్థానికులు అతన్ని పట్టుకుని చితకబాదారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.