Two Women Killed in Nizamabad Road Accident : తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ మాక్లూర్ మండలంలోని మహాత్మా జ్యోతిబాఫులే పాఠశాల వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరికి తీవ్ర గాయలయ్యాయి. సెలవు దినం కావడంతో పాఠశాల దగ్గరకు తల్లిదండ్రులు వచ్చారు. పాఠశాల ముందు బాలికలతో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో అటువైపుగా వచ్చిన కారు వారిపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మహిళలు మరణించగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందంటూ స్థానికులు అతన్ని పట్టుకుని చితకబాదారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కారు బీభత్సం - ఇద్దరు మహిళల మృతి, మరో ఇద్దరికి గాయాలు
![ETV Bharat Andhra Pradesh Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 14, 2024, 7:09 PM IST
![కారు బీభత్సం - ఇద్దరు మహిళల మృతి, మరో ఇద్దరికి గాయాలు Two Women Killed in Road Accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-07-2024/1200-675-21950083-thumbnail-16x9-two-women-killed-in-road-accident.jpg?imwidth=3840)
Two Women Killed in Nizamabad Road Accident : తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ మాక్లూర్ మండలంలోని మహాత్మా జ్యోతిబాఫులే పాఠశాల వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరికి తీవ్ర గాయలయ్యాయి. సెలవు దినం కావడంతో పాఠశాల దగ్గరకు తల్లిదండ్రులు వచ్చారు. పాఠశాల ముందు బాలికలతో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో అటువైపుగా వచ్చిన కారు వారిపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మహిళలు మరణించగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందంటూ స్థానికులు అతన్ని పట్టుకుని చితకబాదారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.