CM Revanth Reddy Delhi Tour Today : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజులు పర్యటన నిమిత్తం దిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడంతో పాటు పలువురు కేంద్రమంత్రులను కలిసేందుకు అనుమతి కోరినట్లు తెలుస్తోంది. సీఎంతో పాటు పలు శాఖలకు చెందిన అధికారులు కూడా కొందరు హస్తినకు వెళ్తున్నట్టు సమాచారం. ఇప్పటికే వివిధ శాఖలకు చెందిన కేంద్రమంత్రుల అనుమతులు ఖరారు అయ్యాయని తెలుస్తోంది.
Revanth Reddy Meet Central Ministers : దిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి చర్చించనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలు చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.