CM Chandrababu Will Go to Delhi in Tomorrow: ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం రాత్రి దిల్లీకి వెళ్లనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన హస్తిన పర్యటనకు వెళ్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలపై గురువారం ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులతో చర్చలు జరపనున్నట్లు సమాచారం. కేంద్రం ప్రవేశ పెట్టబోయే బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు, కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి గతంలో రావాల్సిన నిధులు, కొత్తగా తెచ్చుకోవాల్సిన పథకాలపై నిర్మలా సీతారామన్తో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు తదితర అంశాలపై కేంద్రంలోని ఎన్డీఏ నాయకులతో చంద్రబాబు చర్చించనున్నారు. గత ఐదేళ్లలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను అధికారులు ఇప్పటికే సేకరించారు.
ఇవాళ దిల్లీకి సీఎం చంద్రబాబు - రేపు ప్రధాని మోదీతో భేటీ
![ETV Bharat Andhra Pradesh Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 2, 2024, 5:39 PM IST
![ఇవాళ దిల్లీకి సీఎం చంద్రబాబు - రేపు ప్రధాని మోదీతో భేటీ CHANDRABABU DELHI TOUR](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-07-2024/1200-675-21851170-thumbnail-16x9-cm-chandrababu.jpg?imwidth=3840)
CM Chandrababu Will Go to Delhi in Tomorrow: ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం రాత్రి దిల్లీకి వెళ్లనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన హస్తిన పర్యటనకు వెళ్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలపై గురువారం ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులతో చర్చలు జరపనున్నట్లు సమాచారం. కేంద్రం ప్రవేశ పెట్టబోయే బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు, కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి గతంలో రావాల్సిన నిధులు, కొత్తగా తెచ్చుకోవాల్సిన పథకాలపై నిర్మలా సీతారామన్తో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు తదితర అంశాలపై కేంద్రంలోని ఎన్డీఏ నాయకులతో చంద్రబాబు చర్చించనున్నారు. గత ఐదేళ్లలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను అధికారులు ఇప్పటికే సేకరించారు.