Yuvraj Singh All Time 11: టీమ్ఇండియా లెజెండ్స్ జట్టు 2024 వరల్డ్ ఛాంపియన్షిప్ లెజెండ్స్ టోర్నీలో విజేతగా నిలిచింది. శనివారం పాకిస్థాన్తో జరిగిన ఫైనల్లో యువరాజ్ సింగ్ నాయకత్వంలోని టీమ్ఇండియా లెజెండ్స్ 5 వికెట్ల తేడాతో నెగ్గారు. అయితే మ్యాచ్ అనంతరం యువీ ప్రజెంటేటర్తో చిట్చాట్లో పాల్గొన్నాడు. ఈ క్రమంలో యువీ తన ఆల్టైమ్ ప్లేయింగ్ 11 జట్టును ప్రకటించాడు. ఇందులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్తోపాటు వరల్డ్కప్ విన్నింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఉన్నారు. ఇక 12వ ప్లేయర్గా తతను తాను ఎంపికచేసుకున్నాడు. అయితే టీమ్ఇండియా మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ ఎమ్ఎస్ ధోనీని మాత్రం యువీ ఎంపిక చేయలేదు.
యువీ ప్లేయింగ్ 11: సచిన్ తెందూల్కర్, రికీ పాంటింగ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, ఆడమ్ గిల్క్రిస్ట్, షేన్వార్న్, ముత్తయ్య మురళీధరన్, మెక్గ్రాత్, వసీం అక్రమ్, ఆండ్రూ ఫ్లింటాఫ్.