ETV Bharat / snippets

ప్రకాశం బ్యారేజీ వద్ద క్రమంగా తగ్గుతున్న వరద ఉద్ధృతి

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 4, 2024, 12:03 PM IST

floods_decreasing_in_prakasam_barrage
floods_decreasing_in_prakasam_barrage (ETV Bharat)

Floods Decreasing in Prakasam Barrage : ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. బ్యారేజీకి వరద నీరు ప్రస్తుతం 4,17,694 క్యూసెక్కులగా నమోదయ్యింది. 70 గేట్ల ద్వారా యథాతథంగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాలువలకు 500 క్యూసెక్కుల వరద నీరు విడుదల చేస్తున్నారు. రాగల 4 రోజుల్లో బ్యారేజీకి 148 టీ ఏం సీ ల వరద నీరు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. రేపటికి మళ్ళీ ప్రకాశం బ్యారేజి కి 5.37 లక్షల క్యూసెక్కుల వరదనీరు వస్తుందని జలవనరుల శాఖ అంచనా వేస్తుంది. ఆ తరవాత క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని, సెప్టెంబర్ 8 నాటికి వరద ఉధృతి 3 లక్షల క్యూసెక్కుల కు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

Floods Decreasing in Prakasam Barrage : ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. బ్యారేజీకి వరద నీరు ప్రస్తుతం 4,17,694 క్యూసెక్కులగా నమోదయ్యింది. 70 గేట్ల ద్వారా యథాతథంగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాలువలకు 500 క్యూసెక్కుల వరద నీరు విడుదల చేస్తున్నారు. రాగల 4 రోజుల్లో బ్యారేజీకి 148 టీ ఏం సీ ల వరద నీరు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. రేపటికి మళ్ళీ ప్రకాశం బ్యారేజి కి 5.37 లక్షల క్యూసెక్కుల వరదనీరు వస్తుందని జలవనరుల శాఖ అంచనా వేస్తుంది. ఆ తరవాత క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని, సెప్టెంబర్ 8 నాటికి వరద ఉధృతి 3 లక్షల క్యూసెక్కుల కు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.