Air Strike In Gaza : గాజాలో ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది పౌరులు దుర్మరణం చెందారు. అనేకమంది క్షతగాత్రులుగా మారారు. సీజ్ఫైర్, బందీల విడుదల కోసం అమెరికా, ఖతార్, ఈజిప్టు మధ్యవర్తిత్వంతో జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిసినట్లు ప్రకటన వెలువడిన వెంటనే ఇజ్రాయెల్ దాడులకు తెగబడింది. జవైదా పట్టణంలో శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తున్న ఓ ఇంటిని, దాని పక్కనే ఉన్న గిడ్డంగిని నెతన్యాహు సేనలు లక్ష్యంగా చేసుకున్నాయి. దాడి సమయంలో ఇంట్లో 40మంది పౌరులు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. భవన శిథిలాల కింద ఎవరైనా చిక్కుకుని ఉండొచ్చన్న అనుమానంతో జేసీబీలతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. 10 నెలలుగా గాజాలో సాగుతున్న దాడుల్లో మరణించినవారి సంఖ్య ఇప్పటికే 40వేలు దాటింది.
గాజాలో దారుణం- ఒకే కుటుంబానికి చెందిన 18మంది దుర్మరణం
Published : Aug 17, 2024, 5:07 PM IST
Air Strike In Gaza : గాజాలో ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది పౌరులు దుర్మరణం చెందారు. అనేకమంది క్షతగాత్రులుగా మారారు. సీజ్ఫైర్, బందీల విడుదల కోసం అమెరికా, ఖతార్, ఈజిప్టు మధ్యవర్తిత్వంతో జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిసినట్లు ప్రకటన వెలువడిన వెంటనే ఇజ్రాయెల్ దాడులకు తెగబడింది. జవైదా పట్టణంలో శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తున్న ఓ ఇంటిని, దాని పక్కనే ఉన్న గిడ్డంగిని నెతన్యాహు సేనలు లక్ష్యంగా చేసుకున్నాయి. దాడి సమయంలో ఇంట్లో 40మంది పౌరులు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. భవన శిథిలాల కింద ఎవరైనా చిక్కుకుని ఉండొచ్చన్న అనుమానంతో జేసీబీలతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. 10 నెలలుగా గాజాలో సాగుతున్న దాడుల్లో మరణించినవారి సంఖ్య ఇప్పటికే 40వేలు దాటింది.