INDIA Alliance On NEET : పార్లమెంట్లో నీట్ పరీక్ష అంశంపై చర్చ జరిపాలని విపక్ష కూటమి ఇండియా నేతలు శుక్రవారం డిమాండ్ చేయనున్నారు. ఒకవేళ చర్చకు అనుమతి ఇవ్వకపోతే, సభలోనే నిరసన తెలపనున్నారు. ఈ మేరకు దిల్లీలోని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇంట్లో గురువారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఇండియా కూటమి నేతలు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగే చర్చలో కూడా పాల్గొనాలని నిర్ణయించారు. ప్రతిపక్షాలంతా ఐక్యంగా ఉన్నాయని సమావేశం అయ్యాక రాష్ట్రీయ లోక్తంత్రిక్ పార్టీ అధ్యక్షుడు హనుమాన్ బేనివాల్ మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. పార్లమెంట్లో నీట్, అగ్నివీర్, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, MSP అంశాలను లేవనెత్తుతామని చెప్పారు.
'NEETపై చర్చ జరపాల్సిందే'- పార్లమెంట్లో 'ఇండియా' కూటమి డిమాండ్!
![ETV Bharat Telugu Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg?imwidth=128)
Published : Jun 27, 2024, 6:50 PM IST
!['NEETపై చర్చ జరపాల్సిందే'- పార్లమెంట్లో 'ఇండియా' కూటమి డిమాండ్! INDIA Alliance](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/27-06-2024/1200-675-21811666-thumbnail-16x9-india.jpg?imwidth=3840)
INDIA Alliance On NEET : పార్లమెంట్లో నీట్ పరీక్ష అంశంపై చర్చ జరిపాలని విపక్ష కూటమి ఇండియా నేతలు శుక్రవారం డిమాండ్ చేయనున్నారు. ఒకవేళ చర్చకు అనుమతి ఇవ్వకపోతే, సభలోనే నిరసన తెలపనున్నారు. ఈ మేరకు దిల్లీలోని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇంట్లో గురువారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఇండియా కూటమి నేతలు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగే చర్చలో కూడా పాల్గొనాలని నిర్ణయించారు. ప్రతిపక్షాలంతా ఐక్యంగా ఉన్నాయని సమావేశం అయ్యాక రాష్ట్రీయ లోక్తంత్రిక్ పార్టీ అధ్యక్షుడు హనుమాన్ బేనివాల్ మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. పార్లమెంట్లో నీట్, అగ్నివీర్, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, MSP అంశాలను లేవనెత్తుతామని చెప్పారు.