ఆలయ భూమిని కబ్జా చేసిన మాజీ మంత్రి కన్నబాబు అనుచరులు - YCP Leaders occupied temple land

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 8, 2024, 9:21 PM IST

thumbnail
కన్నుపడితే కైవసమే - ఆలయ భూమిని కబ్జా చేసిన మాజీ మంత్రి కన్నబాబు అనుచరులు (ETV Bharat)

YSRCP Ex Minister Kannababu Followers Occupied Temple Land : వైఎస్సార్సీపీ నేతల భూ దాహానికి అడ్డు అదుపులేకుండా పోయింది. గత ఐదేళ్లలో అధికారాన్ని అడ్డంపెట్టుకొని ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను ఆక్రమించుకున్నారు. తాజాగా కాకినాడ జిల్లాలో దేవాలయానికి చెందిన భూమిని ఆక్రమించుకున్నారని ఆలయ కమిటీ సభ్యులు కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. కాకినాడ గ్రామీణ మండలం గైగులపాడులోని విష్ణాలయానికి చెందిన 30 సెంట్ల భూమిని వైసీపీ నాయకులు ఆక్రమించారని ఆలయ కమిటీ సభ్యులు ఆరోపించారు. అక్రమార్కుల చెర నుంచి భూమిని విడిపించాలని సభ్యులు ఈరోజు కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. 

మాజీ మంత్రి కన్నబాబు అనుచరులు కిరణ్ కుమార్, రియల్టర్‌ రాఘవరాజు, సర్రబాబు ఫోర్జరీ సంతకాలతో భూమిని కాజేశారని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అధికారులకు ఫిర్యాదు చేశారు. అక్రమార్కుల చెర నుంచి దేవుడి భూమిని విడిపించాలని సర్పవరం పోలీసులకు ఎన్నిసార్లు విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైన వారిపై తగిన చర్యలు తీసుకుని దేవుడి భూమిని కాపాడాలని ఆలయ కమిటీ సభ్యులు విజ్ఙప్తి చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.