thumbnail

LIVE వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు- ముఖ్య అతిథిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి - YSR Birth Anniversary Celebrations

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 8, 2024, 6:12 PM IST

Updated : Jul 8, 2024, 8:09 PM IST

Revanth Reddy at YSR Birth Anniversary Celebrations : మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత డాక్టర్ వైఎస్‌.రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఏపీసీసీ ఆధ్వర్యంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి 75వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మంత్రులను ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇటీవల హైదరాబాద్​లో కలిసిన విషయం తెలిసిందే. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలకు హాజరుకావాల్సిందిగా ఆమె వారిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్వహిస్తోంది. ఈ సభకు జాతీయ నేతలతో పాటుగా తెలంగాణ, కర్ణాటక కాంగ్రెస్ నేతలు హాజరుకానున్నారు. మాణికం ఠాగూర్‌ ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. మరోవైపు ఈ రోజు ఉదయం వైఎస్‌ రాజశేఖరరెడ్డి 75వ జయంతి సందర్భంగా ఇడుపులపాయ ఘాట్‌ వద్ద ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించనున్నారు. తొలుత జగన్‌ నివాళులర్పించి వెళ్లిన తర్వాత షర్మిల హాజరయ్యారు. ప్రస్తుతం మంగళగిరిలో రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ప్రత్యక్ష ప్రసారం.  
Last Updated : Jul 8, 2024, 8:09 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.