thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 26, 2024, 10:15 PM IST

ETV Bharat / Videos

విశాఖలో హఠాత్తుగా వెలసిన వైఎస్సార్​ విగ్రహం - అనుమతులు లేకుండా ఏర్పాటు - YSR Statue Suddenly Arrange

YS Rajasekhar Reddy Statue Suddenly Arrange in Visakha : విశాఖ నగరం నడి బొడ్డున హఠాత్తుగా వైఎస్​ రాజశేఖరరెడ్డి విగ్రహం వెలిసింది. వైఎస్సార్సీపీ నాయకుల చొరవతో రాత్రికి రాత్రే అక్కయ్యపాలెం హైవేకి అనుకుని ఉన్న స్థలంలో వైఎస్సార్​ విగ్రహం (YSR Statue) ఏర్పాటైంది. అధికారంలో ఉండగా ఎటువంటి అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున గ్రీన్ బెల్ట్ ప్రాంతంలో పార్టీ జెండా పోల్​ను వైఎస్సార్సీపీ శ్రేణులు ఏర్పాటు చేశాయి. 

ఇటీవల ఎన్నికల కోడ్ రావటంతో ఈ పోల్ నుంచి పార్టీ జెండాను తొలగించాల్సి వచ్చింది. దీంతో అప్పటి నుంచి వైఎస్సార్సీపీ జెండా పోల్​లో పెట్టకపోవటంతో ఈ ప్రాంతంలో ఓపెన్ జిమ్​తో పాటు మొక్కలు సైతం ఏర్పాటు చేశారు. అలాంటిది ఇప్పుడు రాత్రికి రాత్రే పార్టీ జెండా పోల్ స్థానంలో వైఎస్సార్​ విగ్రహం పెట్టడంపై స్థానికులు విస్మయం చెందుతున్నారు. అనుమతి లేకుండా విగ్రహాలు పెడుతుంటే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏం చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.