వర్షాలకు అస్తవ్యస్తమైన గిరిజనుల జనజీవనం - వాగులు దాటేందుకు అవస్థలు - Tribals Suffering to Rains - TRIBALS SUFFERING TO RAINS
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/27-07-2024/640-480-22063597-thumbnail-16x9-water.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 27, 2024, 8:07 PM IST
Tribals Suffering Due to Delay in Construction Bridges : మన్యం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గిరిజనుల జనజీవనం అస్తవ్యస్తమైంది. వంతెనలు నిర్మించడంలో గత ప్రభుత్వ నిర్లక్ష్యం వహించడంతో ప్రస్తుతం మన్యంలోని మారుమూల గ్రామాల ప్రజల రాకపోకలకు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముంచంగిపుట్టు మండలంలోని లక్షీపురం - బుంగపుట్ వెళ్లే మార్గంలో వంతెన మంజూరైనా నేటికీ పనులు పూర్తి కాలేదు. ప్రస్తుతం వర్షాల దాటికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వాగు దాటి వెళ్లేందుకు వంతెనను నిర్మించకపోవడంతో ప్రవాహంలో ద్విచక్ర వాహనాలను భుజాలపై గిరిజనులు మోసుకుంటూ వెళుతున్నారు.
ప్రస్తుతం డుమాచల జలాశయం నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరువలో ఉంది. ఈనెల 20న నుంచి వరద నీటిని విడుదల చేస్తున్నప్పటికీ మచ్చ గడ్డ ప్రవాహం మాత్రం తగ్గట్లేదు. జలాశయం నీటిమట్టం పెరగడంతో ప్రాజెక్టులోని ఆరు గేట్లు ఎత్తి 4000 క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేశారు. మంచిముట్టు సంత వర్షం దాటికి వెలవెలబోయింది. వర్షపు నీరు దుకాణాల వద్దకు చేరడంతో వ్యాపారులు అనేక ఇబ్బందులు పడ్డారు.